మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలి
VB-G RAM G కు నిరసన
సీఎం రేవంత్ రెడ్డి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం కోసం ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేందుకు కూడా వెనుకడుగు వేయనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా మున్సిపల్ స్థానాలు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పరంగా పట్ణణాల అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి పెడుతామన్నారు. గాంధీ భవన్ లో జరిగిన పార్టీ విస్త్రత స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరైన సీఎం పలు అంశాలపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో లో 80 శాతం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో సభ్యులుగా ఉన్నారన్నారు. చట్ట సభల్లో మోడీకి బలం ఉందని పేదలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం గత ఎన్నికల్లో చేసిందని చెప్పారు. అదానీ, అంబానీ కి దేశాన్ని అప్పగించే కుట్ర అమలు కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందిని సీఎం చెప్పారు. SIR పేరుతో పేదలు, మైనార్టీల ఓటు హక్కు ను తొలగించే ప్రయత్నం జరుగుతోంది.. పేదలకు ఓటు పోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతాయని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తో పేదల ఆత్మగౌరవం పెరిగింది.. అంబానీ, అదానీకి తక్కువ వేతనాలకు కూలీలను పంపించడానికే ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీని వెనుక ప్రధాని మోదీ, కార్పొరేట్ కంపెనీల కుట్ర ఉందన్నారు.

గతంలో రైతు వ్యతిరేక చట్టాలను బీజెపి ప్రభుత్వం తెచ్చిందని కాంగ్రెస్ పోరాట ఫలితంలో దేశ రైతులకు మోదీ క్షమాపణ చెప్పి, నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం లో రాహుల్ గాంధీ విజయవంతమయ్యారు..
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని సీఎం వెల్లడించారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలో మార్పులను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసింది.. ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. ప్రతి మండలానికి ఒక ఇంచార్జీ ని నియమించాలని.. నేను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని సీఎం వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ములుగు లో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీ ని ఆహ్వానిస్తామన్నారు.కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలి.. కార్యకర్తల కష్టం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాం..ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా పైన ఉందన్నారు….. కార్యకర్తల గెలుపు కోసం గల్లీ గల్లీ కాదు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తా.. కాంగ్రెస్ పార్టీ వల్లనే నేను ముఖ్యమంత్రి అయ్యానని సీఎం వ్యాఖ్యానించారు..








Leave a Reply