తలలు పట్టుకుంటున్న పోలీసులు
వినియోగం ఎందుకో తెలుసుకోలేకపోతున్న అధికారులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రహస్యంగా మూగజీవాల రక్తం తీస్తు పట్టుబడ్డ వ్యక్తుల వెనుక పెద్ద ముఠా ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం కీసరలో పోలీసులకు పట్టుబడ్డలో ఒక వెటర్నరీ డాక్టర్ తో పాటు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూగ జీవాల రక్తం సేకరిస్తూ పట్టుబడడం కొత్త కేసు వెలుగు లోకి రావడంతో పోలీసులు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కేసు విచారణలో భాగంగా ప్రాథమికంగా సమాచారం సేకరించిన పోలీసులు ఎవరి ఆదేశాలతో రక్తం తీసుకున్నారన్న సమచారం సేకరించి వారి కార్యాలయంపై దాడులు నిర్వహించారు. డ్రగ్ కంట్రో ల్ అధికారుల సమన్వయంతో జరిపిన దాడిలో ఆసక్తి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఇంపోర్టెడ్ వ్యాపర సంస్థ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ ముఠా భారీగా జంతువుల రక్తాన్ని సేకరించినట్లు పోలీసులు సోదాల్లో గుర్తించారు. ఈ రక్తంతో ప్రయోగాలు చేసేందుకు సేకరించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నా వాస్తవాన్ని పోలీసులు కూడా గుర్తించలేకపోతున్నారు. మానవుల రక్తాన్ని సేకరించేందుకు బ్లడ్ బ్యాంకులు వినియోగించే బ్యాగుల్లోనే జంతుల రక్తాన్ని స్టోర్ చేసినట్లు అధికారలు గుర్తించారు.

నెత్తురు వినియోగంపై మిస్టరీ…..
హర్యానాకు చెందిన పాలీమెడిక్యూర్ కంపెనీకి సేకరించిన జంతు రక్తాన్ని పంపిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీన్ని ఆ సంస్థ ఎందుకు వినియోగిస్తోందో అన్న అనుమానాలు అధికారులను వెంటాడుతున్నాయి. అనధికారిక క్లినికల్ ట్రయల్స్,ఈ రక్తాన్ని ఉపయోగించి ఉండవచ్చని డ్రగ్ కంట్రోల్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జంతువుల రక్తాన్ని సేకరించడం కీలక వ్యవహారమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
సీరం తయరీకా లేదా…మరెదైనా నా…

జంతువుల రక్తంతో సిరం తయారీకీ ఉపయోగించే అవకాశం ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇక్కడ పోలీసులకు లభ్యం కాలేదు. టీకాల తయారీకి వినియోగించే సిరం తయారీకి దీన్ని వినియోగించే అవకాశాలు కూడా ఉన్నాయని ఔశధ నియంత్రణ అధికారులు అంటున్నారు.500 మిల్లీలీటర్ల రక్తం నుంచి దాదాపు 200 మిల్లీలీటర్ల సీరమ్ పొందవచ్చని, ఈ సీరంను చర్మ చికిత్సలు, హెయిర్ ప్రొడక్ట్స్, అలాగే టీకాల తయారీలో కూడా ఉపయోగిస్తారని అంటున్నారు.
ప్రాణాంతకమని హెచ్చరిక….
జంతు రక్తం పొరపాటున కూడా మానవ వైద్య సరఫరా వ్యవస్థలోకి వెళితే ప్రాణాంతక పరిణామాలు తలెత్తుతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఇది చాలా భయంకరమైన కేసు. పొరపాటున కూడా జంతు రక్తం ఏదైనా ఆసుపత్రికి చేరితే ప్రాణ నష్టం సంభవిస్తుంది. మానవ రక్తంలో కూడా గ్రూప్ సరిపోలకపోతే మరణం సంభవిస్తుంది. సీనియర్ పోలీసు అధికారులకు కూడా తమ సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడు చూడకపోవడంతో కేసుపై పోలీసు శాఖ సీరియస్ గా ఉంది. జంతు రక్తం సేకరించి ఎందుకు వినియోగిస్తున్నారన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు.
పరారీలో నిందితుడు……
CNK ఇంపోర్ట్ ఎగుమతి కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. అధికారికంగా ఇంపోర్ట్–ఎగుమతి ఆపరేటర్గా నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని పట్టుకునే వరకు రక్తంతో అతడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా చెప్పలేం,” అని అధికారులు తెలిపారు. ఈ కేసును కీసర పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ సెక్షన్ 18(c) కింద నమోదు చేశారు. డ్రగ్ నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలు స్పష్టంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేసి, రక్త నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించారు. కంపెనీ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. జంతు క్రూరత్వ చట్టాల ఉల్లంఘనలపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.






Leave a Reply