కేసీఆర్ కు సాదర ఆహ్వానం..
(హైదరాబాద్,న్యూస్ఇన్)
మరికొద్ది రోజుల్లో మొదలు కానున్న మేడారం మహాజాతరకు ప్రభుత్వం తరపున మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ను మహిళా మంత్రులు వెళ్లి ఆహ్వానించారు. ఎర్రవల్లి నివాసానికి మంత్రలు సీతక్క, కొండా సురేఖలు వెళ్లి కేసిఆర్ దంపతులకు ఆహ్వాన పత్రికను ఆందచేశారు. మహా జాతరకు తప్పనిసరిగా రావాల్సిందిగా కేసీఆర్ గారిని, ఆయన సతీమణి శోభమ్మను ఆహ్వానించారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా మేడారం మహా జాతర ఆహ్వానం అందజేశానని, ఆ సమయంలో కేసీఆర్ కలుసుకునే అవకాశం రాలేదని, అందుకే స్వయంగా ఫామ్ హౌస్కు వచ్చి ఆయనను ఆహ్వానించామని చెప్పారు.

అలాగే ఆలయ ప్రసాదమైన బంగారం, నూతన వస్త్రాలను కేసీఆర్ దంపతులకు బహుకరించారు.ఆహ్వాన పత్రాన్ని స్వీకరించిన కేసీఆర్ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మేడారం మహా జాతరకు హాజరవుతానని తెలిపారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ నిర్మాణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో మంత్రులను కేసిఆర్ అడిగి తెలుసుకున్నారు.ఆహ్వాన కార్యక్రమం అనంతరం కేసీఆర్ సతీమణి శోభమ్మ మంత్రులు సీతక్క, కొండా సురేఖలకు బొట్టు పెట్టి, నూతన వస్త్రాలను బహుకరించారు.






Leave a Reply