NewsInn

News in a Click

2027 – తెలంగాణాకు తొలి జ‌నగ‌ణ‌న‌……!

2027 – తెలంగాణాకు తొలి జ‌నగ‌ణ‌న‌……!

జ‌న‌గ‌ణ‌పై స‌మ‌గ్ర స‌మాచారం పార్ట్-3

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

దేశ వ్యాప్తంగా గ‌తంలో ప‌దేళ్ల‌కు ఒక సారి జ‌న‌గ‌ణ‌న నిర్వ‌హించ‌గా…. ఈ సారి 16 ఏళ్ల‌కు జ‌న‌గ‌ణ‌ను ప్ర‌భుత్వం చేయాల్సి వ‌స్తుంది. పూర్తి డిజిట‌లైజేష‌న్ ప్ర‌క్రియ‌లోనే జ‌న‌గ‌ణ‌న జ‌రుగ నుంది. ఒక సారి కేంద్ర ప్ర‌భుత్వం యాక్సెస్ ఇచ్చే యాప్ ద్వారానే ఎన్యుమ‌రేట‌ర్లు త‌మ ప‌రిధిలో జ‌న‌గ‌ణ‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. పేప‌ర్ లెస్ గా ప్ర‌క్రియ దేశ వ్యాప్తంగా పూర్తి కానుంది. ప్ర‌భుత్వం ఇచ్చే యాప్ యాక్సెస్ తో జ‌న‌గ‌ణన త‌రువాత కేంద్ర ప్ర‌భుత్వం సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఆ ఫార్మ‌ట్ నింపి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఎన్యుమ‌రేట‌ర్ ఒక్క సారి ఈ స‌మాచారాన్ని సేక‌రించి స‌ర్వ‌ర్ కు సింక్ చేసిన‌ట్ల‌యితే ఎన్యుమ‌రేట‌ర్ యాప్ లో నుంచి ఆ స‌మాచారం మొత్తం ఆ పై స్థాయి అధికారుల‌కు మాత్ర‌మే క‌నిపిస్తోంది. ఆ అధికారులు ఏమైనా అనుమ‌నాలు వ్య‌క్తం చేస్తేనే తిరిగి ఆ ఇంటికి వెళ్లి పై అధికారుల అనుమ‌తితో ఆ స‌మాచారాన్ని స‌రిచేసేలా ప్ర‌భుత్వం సాంకేతికంగా ఏర్పాట్లు చేసింది.

తెలంగాణాకు తొలి జ‌నగ‌ణ‌న‌…..

కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న జ‌న‌గ‌ణన తెలంగాణా ఆవిర్భావం త‌రువాత చేప‌డుతున్న తొలి జ‌నాభా లెక్క‌లు. 2014లో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం త‌రువాత పాత జ‌నాభా లెక్క‌ల ప్ర‌కార‌మే ఇక్క‌డే ప‌థ‌కాలు అమ‌ల‌వుతూ వ‌చ్చాయి. కానీ తెలంగాణా ఆవిర్భావం త‌రువాత ఏర్పాటైన అప్ప‌టి ప్ర‌భుత్వం స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే పేరుతో స‌ర్వేను నిర్వ‌హించింది. కానీ దీనికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేక‌పోవ‌డంతో…..ఇది అధికారికంగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే జ‌న‌గ‌ణ‌నకు మాత్ర‌మే చ‌ట్ట‌బ‌ద్ద‌త ఉంటుంది. మిగిలిన ఎలాంటి స‌మాచారం ఎవ‌రు సేక‌రించినా అది స‌ర్వేలుగానే ప్ర‌భుత్వం ప‌రిగ‌ణిస్తుంది. దీంతో తెలంగానా జ‌న‌గ‌ణ‌న ఈ జ‌నాభా లెక్క‌ల‌తో స్ప‌ష్త‌త రానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు అంచ‌నాల‌తో సాగినా….జ‌న‌గ‌ణ‌న అనంత‌రం అధికారికంగా అదే స‌మాచారం ప్రాధాన్య‌త గా ప్ర‌భుత్వాలు తీసుకుంటాయి.

తీసుకునే ఆహారంపైనా స‌మాచారం….

మారుతున్న ప‌రిస్థితులు, జీవ‌న‌ప్ర‌మాణాల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ విడ‌త‌లో తీసుకునే ఆహారంపైన కూడా ఒక ప్ర‌శ్న‌ను రూపొందించింది. ప్ర‌ధాన ఆహారం ఏం తీసుకుంటార‌న్న‌దానిపై స‌మాచారం ఈ సారి సెన్సెస‌ల్ లో కేంద్రం సేక‌రిస్తోంది. దీంతో పాటు 32 ప్ర‌శ్న‌ల‌ను ఈ ఫార్మ‌ట్ లో ఉంటాయి. సాధార‌ణంగా ఉండే ప్ర‌శ్న‌ల ద్వారా నే స‌మ‌గ్ర స‌మ‌చారాం రాబ‌ట్టే విధంగా ఫార్మాట్ ను ప్ర‌భుత్వం రూపొందించింది.ఒక్కో నివాసం నుంచి 33 ప్ర‌శ్న‌ల‌కు ఎన్యుమ‌రేట‌ర్లు స‌మాధానం రాబ‌ట్ట‌నున్నారు. ఎన్యుమ‌రేటర్లు ప్ర‌భుత్వం ఖ‌రారు చేసిన ప్ర‌శ్న‌ల‌ను మాత్ర‌మే జ‌న‌గ‌ణ‌ణ సంద‌ర్భంగా అడిగి స‌మాచారం తెలుసుకోవాల‌ని కొత్త స‌మాచారం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అడ‌గ రాద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ప్ర‌భుత్వం వారికి ఇచ్చింది.

కుల‌గుణ‌న‌తో తొలి జ‌నాభా లెక్క‌లు…..

గ‌తంలో జ‌నాభా లెక్క‌ల సంద‌ర్భంగా కుల గ‌ణ‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌లేదు. ఎస్సీ, ఎస్టీ, ఇత‌రులు అన్న స‌మాచారాన్ని మాత్ర‌మే సేక‌రించింది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు దేశ వ్యాప్తంగా ఉన్న కులాల ఆధారంగా కూడా జ‌నాభా లెక్క‌ల‌ను ఈ సారి కేంద్ర ప్ర‌భుత్వం సేక‌రించ‌నుంది. స్వాతంత్రం త‌రువాత తొలిసారి కుల‌గ‌ణ‌న చేస్తుండ‌డంతో భ‌విష్య‌త్తులో ఈ ప్ర‌భావం అన్ని రంగాల‌పై స్ప‌ష్టంగా క‌నిపించే అవ‌కాశం ఉంటుంది.దీంతొ దేశ వ్యాప్తంగా ఈ జ‌నాభా లెక్క‌ల‌కు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

జ‌నాభా ఆధారంగానే ప‌థ‌కాలు……

జ‌న‌గ‌ణన ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యాలు తీసుకుంటాయి. ప్ర‌జాస్వామ్యానికి కూడా జ‌న‌గ‌ణ‌న ఒక కీల‌క అడుగు. అసెంబ్లీ, పార్ల‌మెంట్ నియోజ‌క‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, రిజ‌ర్వేష‌న్లు త‌దిత‌ర అంశాలు జ‌న‌గ‌ణ‌న‌తోనే ముడిప‌డి ఉంటాయి. ఈ సారి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో ఈ జ‌న‌గ‌ణ‌న ఆధారంగానే త‌దుప‌రి నిర్ణ‌యాలు అమ‌లు కానున్నాయి. ఇక కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు కేటాయించే నిధులు జ‌నాభా ఆధారంగానే కేటాయింపు జ‌రుగుతోంది. ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌నకు ఇవే కీల‌కం.

జ‌న‌గ‌ణ‌న‌లో కేంద్రం కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టేందుకు అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 420 అంశాల‌పై స‌మాచారాన్ని సేక‌రిస్తుండ‌గా…గ్రామీణ ప్రాంతాల్లో 400 అంశాల‌పై ప్ర‌భుత్వం గ్రామ స్థాయి నుంచి స‌మాచారం సేక‌రించ‌నుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *