NewsInn

News in a Click

పేద విద్యార్థుల చదువులకు అండ‌గా కేసిఆర్

పేద విద్యార్థుల చదువులకు అండ‌గా  కేసిఆర్

ఉన్న‌త విద్య‌తో ఉన్న‌త స్థాయికి ఎద‌గాలి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఉన్న‌త విద్యాభ్యాసం ఇద్ద‌రు విద్యార్థుల ఫీజులు భ‌రించేందుకు మాజీ సీఎం కేసిఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు.
విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బి టెక్ చదువుతున్న నవీన్, అదే గ్రామానికి చెందిన, ప్రమాద వశాత్తూ కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన,మరో పేద రైతు పెద్దోళ్ల సాయిలు కొడుకు, బి టెక్ చదువుతున్న అజయ్., లను చేరదీసి వారి ఇంజనీరింగ్ చదువు పూర్తికాలపు ఫీజులను బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ చెల్లించారు.

వారికి అవ‌స‌ర‌మ‌య్యే పుస్త‌కాలు, ల్యాప్ టాప్ కోసం కూడా ప్ర‌త్యేకంగా ఆర్ధిక స‌హాయం చేశారు. ఆ ఇద్ద‌రు విద్యార్థుల‌కు విడివిడిగా నాలుగు సంవ్స‌త‌రాలకు అయ్యే ఫీజుల చెక్కులు కేసిఆర్ అంద‌చేశారు. క‌ష్ట‌ప‌డి చ‌ద‌వి ఉన్న‌త‌స్థానానికి చేరుకోవాల‌ని కేసిఆర్ వారిని అభినందిస్తూ…ఏ అవ‌స‌రం ఉన్నా ఆదుకునేందుకు అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు.విద్యుత్ ప్రమాదంలో మరణించిన చిన్రాజు సత్తయ్య కుటుంబానికి సంబంధిత విద్యుత్ శాఖ నుంచి చట్టపరంగా అందే ఆర్థిక తదితర సాయం గురించి పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా చూడాలని తన వ్యక్తిగత కార్యదర్శి నాగేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *