NewsInn

News in a Click

పీక్ స్టేజీకి పాలకుర్తి కాంగ్రెస్ పంచాయతీ

మీనాక్షి నటరాజన్ తో కాంగ్రెస్ అసమ్మతి నేత‌ల భేటీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

పాల‌కుర్తి కాంగ్రెస్ నేత‌ల్లో పోరు పీక్ స్టేజీకి చేరుకుంది. ఎమ్మెల్యే గా ఎన్నికైన య‌శ‌శ్విని రెడ్డితో ఇబ్బందులు లేక‌పోయినా ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి వర్సెస్ అస‌మ్మ‌తి నేత‌లు అన్నచందంగా నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారాయి. నియోజ‌క‌వ‌ర్గంలో పెత్త‌నం చేస్తున్న ఝాన్సీ రాణిపై అస‌మ్మ‌తి నేత‌లు ఒక్కొక్క‌రు గళం విప్పుతున్నారు. రెండేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్య పోరు న‌డుస్తున్నా…తాజాగా అస‌మ్మ‌తి నేత‌లంతా హైద‌రాబాద్ వ‌చ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ తో భేటీ అయ్యారు.ఝాన్సీ కార‌ణంగానే నియోజ‌క‌వ‌ర్గంలోని మేజ‌ర్ గ్రామ‌పంచాయ‌తీలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకోలేక‌పోయింద‌ని అస‌మ్మ‌తి నేత‌లు ఇంచార్జ్ కు తెలియ‌చేశారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో కూడా కాంగ్రెస్ అస‌మ్మ‌తి వ‌ర్గం నేత విజ‌యం సాధించార‌ని అస‌మ్మ‌తి నేత‌లు పేర్కొ్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే అభ్యర్థికి 48.వేల ఓట్ల మెజార్టీ వస్తే. స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలలో నియోజకవర్గంలో మొత్తంగా బీఆర్ ఎస్ పార్టీకి 2000 ఓట్ల మెజార్టీ వచ్చిందని వెల్ల‌డించారు. కడియం కావ్య ఎంపీ.ఫండ్స్ పాలకుర్తి నియోజకవర్గానికి ఇస్తే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు తెలియడం లేద‌ని వాపోయారు. అధిష్టానం చొరవ చూపి సమన్వయం చేయకపోతే రాబోయే తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఒక కౌన్సిలర్ కూడా గెలిచే అవకాశం లేదని తేల్చి చెప్పారు. .. 16 స్థానాల్లో అసమ్మతి అభ్యర్థులను పెట్టి గెలిపించుకుంటామ‌న్నారు. టిపిసిసి ఉపాధ్యక్షురాలు పదవి కూడా ఝాన్సీని తొలగించాలని ఫిర్యాదు చేసిన‌ట్లు అస‌మ్మ‌తి నేత‌లు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *