పూర్వ విద్యార్థులు భావి తరాలకు మార్గ దర్శకులు
– గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
(హైదరాబాద్,న్యూస్ఇన్)
బిట్స్ పిలానీ కేవలం విద్యలో ప్రతిభతో మాత్రమే పరిమితం కాదని తరతరాలుగా నూతన ఆవిష్కరణలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, భయంలేని జిజ్ఞాసను పెంపొందిస్తూ వస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. . నేడు విద్య ఒక కీలక మలుపుతో కృత్రిమ మేధస్సు (AI), డేటా సైన్స్, ఆటోమేషన్, డిజిటల్ మార్పులు విద్యా వ్యవస్థను మౌలికంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. . AI ఇక భవిష్యత్తు కల కాదని, ఇది ఇప్పటికే విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలలో విద్యకు ప్రత్యామ్నాయం కానే కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.విద్య కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, మార్పులకు అనుగుణంగా ఎదగగల సామర్థ్యం, జీవితాంతం నేర్చుకునే దృక్పథాన్ని యువత అలవరచుకోవాలన్నారు. బిట్స్ పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ‘బిట్సా గ్లోబల్ మీట్’ (BGM26) ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్లోని బిట్స్(బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ క్యాంపస్లో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు.

AI డేటాను విశ్లేషించగలదు, నిర్ణయాలు తీసుకోగలదు, కానీ మనం తీసుకునే నిర్ణయాలకు ప్రత్యామ్నం ఎప్పటికీ కాదన్నారు. కాబట్టి విద్య లక్ష్యం యంత్రాలతో పోటీ పడడం కాకుండ సమాజ హితానికి సాంకేతికతను దారి చూపగల మానవ విలువలను బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులనుద్దేశించి మాట్లాడతూ బిట్స్ పిలానీ విశిష్ట పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
విశ్వవిద్యాలయాలకు పూర్వవిద్యార్థుల సంఘాలే ప్రాణవాయువనే అభిప్రాయన్ని జాన్ ఎఫ్ కెనాడీ ఏనాడో తన అబిప్రాయాన్ని వెల్లడించారన్నారు. విద్య వినయాన్ని ఇస్తుందని, వినయం అర్హతను కలిగిస్తుందని, అర్హత సంపదను ఇస్తుందని, సంపద ధర్మానికి దారి తీస్తుందని, ధర్మం సుఖాన్ని ఇస్తుందని, ఈ సూత్రం మార్గదర్శకంగా ఉండాలని గవర్నర్ సూచించారు. యువత సహకారం కోసం దేశం ఆశగా ఎదురు చూస్తోందని అని, ఇక్కడి పూర్వ విద్యార్థులు జాతీయ స్వయం సమృద్ధిని ముందుకు నడిపించండడంలో మీ వంతు సహాకారాన్ని అందించాలని సూచించారు. దాన కిశోర్ మాట్లాడుతూ.. సాంకేతికత మరియు నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్ఫోర్స్ డెవలప్మెంట్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా ఎలా సహకరిస్తున్నాయో వివరించారు.
బీజీఎం 2026 ఛైర్పర్సన్ అనిత సాకూరు మాట్లాడుతూ, ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మొదటి రోజు ముగింపులో ఇన్స్టిట్యూట్ వారసత్వాన్ని మరియు స్నేహాన్ని చాటిచెప్పే సంప్రదాయ 'ఖవ్వాలీ' ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.







Leave a Reply