నాపై కోపం ఉంటే నా మీద చూపించు
సిద్దిపేట ప్రజలపై కాదు
రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
(హైదరాబాద్,న్యూస్ ఇన్)

దాదాపు 40 ఏళ్ల సిద్ది పేట ప్రజల కోరికను సీఏంగా కేసిఆర్ నెరవేర్చారని, సిద్దిపేట జిల్లాగా ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువయ్యానే సాకుతూ జిల్లాలను తగ్గించాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలు చేశారు. తనపై కోపం ఉంటే నాపై నే చూపించాలని, కానీ సిద్దిపేట ప్రజలపై చూపవద్దన్నారు. జిల్లాల పునర్విభజన పేరుతో సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తూ చూస్తూ ఉరుకునేది లేదని హెచ్చరించారు. సిద్దిపేట పట్టణ బీజేపి అధ్యక్షుడితో పాటు పలువురు బీఆర్ ఎస్ లో చేరారు ఈ సందర్భంగా హరీష్ రావ్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనా సౌలభ్యం కోసం తమ ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేసిందని అయితే….కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల సంఖ్యను కుదించాలని కుట్రలు చేస్తోందని విమర్శించారు.జిల్లా రద్దయితే కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి, ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఆఫీసులన్నీ పోతాయి. సిద్దిపేట అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సిద్దిపేట అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. అవసరమైతే మరో ఉద్యమం చేస్తామని హరీష్ రావ్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు ఎమైందో రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిద్దిపేట ప్రజల తరపున కొట్లాడేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని హరీష్ రావు అన్నారు.
.


Leave a Reply