(హైదరాబాద్,న్యూస్ఇన్)
టాప్ హీరోల సినిమాలపై తెలంగాణా ప్రభుత్వం ఒక్కో హీరో సినిమా పై… ప్రభుత్వం ఒక్కో లా నిర్ణయం తీసుకుంటుంది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రముఖ హీరోల సినిమాలు వరుసగా విడదలౌతూ వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రాజాసాబ్ సినిమా సందడి సినీ వర్గాల్లో కనిపించగా ….తాజాగా వన శంకర వర ప్రసాద్ సినిమా తెరపైకి వచ్చింది. రాజాసాబ్ సినిమా ధరలు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం చేసింది. కానీ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా ధరల పెంపుకు అడిగిందే తడువుగా నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు యుద్ధప్రాతిదకన ఆదేశాలు ఇచ్చింది.దీంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతోనే ప్రబుత్వం మనశంకర వర ప్రసాద్ పై వెంటనే నిర్ణయం తీసుకుందన్న చర్చ జరుగుతోంది. అయితే సినిమా టికెట్ల పెంపుపై వివాదాలు ఇప్పుడు కొత్తేమి కాదు. ప్రభుత్వం టికెట్ల పెంపుకు అనుమతిస్తే పలువురు కోర్టులను ఆశ్రయిస్తూ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతున్నారు.







Leave a Reply