ప్రీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం చేయాలని.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రానికి ఆర్ధిక సహాయం కావాల్సిన అంశాలపై కేంద్రం ముందు ప్రతిపాదనలు ఉంచారు. కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయడం ముఖ్యమైన చొరవ. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నానని భట్టి వ్యాఖ్యానించారు. .2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని అభినందిస్తున్నానని చెప్పారు.

మా ప్రభుత్వం ముందు చూపుతో మేము తెలంగాణ రైజింగ్ 2047 విజన్ను ఆవిష్కరించామన్నారు. . దీని ద్వారా తెలంగాణను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుండి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నాం. తద్వారా దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యాఖ్యానించారు. .మౌలిక సదుపాయాల రాష్ట్రాల ద్రవ్య లోటు (Fiscal Deficit) పరిమితిని ఏడాదికి కనీసం 4 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు ఇస్తున్న 50 ఏళ్ల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలని కోరారు. విద్య, ఆరోగ్య రంగాల కోసం సేకరించే వనరులను FRBM పరిమితుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. .తెలంగాణలో ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరుతున్నాము.







Leave a Reply