ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్ లో సీఎం
(హైదరాబాద్,న్యూస్ఇన్)
నేను వృత్తి రీత్యా వైద్యుడిని కాదు…కానీ సోషల్ వైద్యుడినని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫెలోస్ ఇండియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం యువ కార్డియాలజిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంతో పాటు అగ్నేయాసియా దేశాల నుంచి 500 మంది పైగా యువ కార్డియాలజిస్టులు ఇక్కడికి రావడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. వైద్య వృత్తిలో ఉంటూ నిరంతరం కొత్త గా అందుబాటులోకి వస్తున్న శాస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. వృత్తి రీత్యా ఎంతో ఎత్తుకు ఎదిగినా నిరంతరం నేర్చుకునే అలవాటు లేకపోతే కేరీర్ కు ముగింపు పలికినట్లే అని సీఎం వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాలలో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. సమాజం పట్ల మీ బాధ్యతను ఎప్పటికీ మరచిపోవద్దని వైద్యులకు సూచించారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. . ప్రజల ప్రయోజనాల కోసం మా పాలసీని మెరుగుపరచడానికి మీలాంటి వైద్యులతో కలిసి పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలతో ఆరోగ్య సంరక్షణ హై టెక్నాలజీతో ముడిపడి ఉందన్నారు. లేటెస్ట్ టెక్నాలజీ పై మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకుంటున్నా…… ప్రజల నాడిని పట్టుకోవడం మరిచిపోవద్దని వైద్యులకు సూచించారు.

ఈ మధ్య కాలంలో గుండె జబ్బులతో చాలా మంది చనిపోతున్నారని,గుండె జబ్బులను నివారించే మిషన్ లో మనమందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు. . విద్యార్థులకు CPR బోధించడానికి మీరు స్వచ్ఛందంగా ముందుకు రాగలిగితే… మన దేశంలో చాలా మంది ప్రాణాలను కాపాడగలమన్నారు. చాలా సార్లు మనం నివారణ గురించి నిర్లక్ష్యం చేస్తుంటాం అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.




Leave a Reply