NewsInn

News in a Click

సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. భద్రత మరువకండి..!

పండుగ వేళ దొంగల కన్ను.. తాళం వేసిన ఇళ్లపైనే

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలుగు రాష్ట్రాల్లతో పాటు పొరుగు రాష్ట్రాల్లో జ‌రుపుకునే కీల‌క పండుగ సంక్రాంతి. ఈ పండ‌గ కోసం ఆంధ్రా ప్రాంత ప్ర‌జ‌లు దాదాపు ఆరు నెల‌లుగా ఏర్పాట్లు చేసుకుంటారు. పండ‌గ‌కు సొంత గ్రామాల‌కు వెళ్లి రావ‌డం అన‌వాయితీ పెట్టుకుంటారు. ఇదే అద‌నుగా చోరీల చేసే వారు తాళం వేసిన ఇళ్ల‌పై దృష్టి పెట్టి….. యాజ‌మానులు వ‌చ్చే వ‌ర‌కు ఇల్లు గుల్ల చేసే సంద‌ర్బాలు త‌ర‌చూ వింటూ ఉంటాం…అయితే పోలీసులు ఎన్ని ముందు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా…ఏదో ఓక చోట చోరీ సంఘ‌ట‌న‌లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ గ్రామాల‌కు వెళ్లే వారికి ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. ఆభ‌ర‌ణాలు, న‌గ‌దును ఇళ్ల‌లో ఉంచి వెళ్ల‌వ‌ద్ద‌ని సూచించారు. సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌యాణానికి సంబంధించి అప్టేడ్స్ పెట్ట‌రాద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. ఆయ‌న మాట‌ల్లోనే మీరు వినండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *