NewsInn

News in a Click

స‌మ్మ‌క్క‌- ది గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకావిష్క‌రణ‌

స‌మ్మ‌క్క‌- ది గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకావిష్క‌రణ‌

మంత్రి సీత‌క్క‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణా సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్యకండి వెంకటరమణ వెలువరించిన సమ్మక్క ది గ్లోరీ ఆఫ్ మేడారం అనే పుస్తకాన్ని మంత్రి సీత‌క్క‌ ఆవిష్కరించారు.మేడారం జాతర ను కళ్ళముందించేలా విస్తృత సమాచారంతో కూడిన ఈ సమ్మక్క గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకం వెలువ‌రించ‌డం పట్ల రచయితను మంత్రి సీతక్క అభినందించారు.

సమ్మక్క – The Glory of Medaram

మేడారం… ఆ పేరులోనే ఒక మహాత్తు ఉంది, ఒక పులకింత ఉంది, ఒక చైతన్యo, ఒక ధిక్కారం ఉంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర నిర్వహణ జిల్లా పాలనా యంతాంగానికి ఓకే సవాల్. దాదాపు కోటికి మందికి పైగా గిరిజనులు, గిరిజనేతరులు హాజరయ్యే ఈ జాతర గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూ ప్రత్యేకత పొందింది. చిన్న అటవీ కుగ్రామంలో మౌలిక సదుపాయాలు అంతంతగా ఉన్న మేడారంలో జరిగే ఈ జాతరను గిరిజన కుంభమేళాగా అభివర్ణిస్తారు. ఈ జాతరకు హాజరయ్యే భక్తజనం కోటికి పాలనా యంత్రాంగం చేసే ఏర్పాట్లు ఏమాత్రం సరిపోదు. అయినప్పటికీ వీటి గురించి ఏమీ ఆశించక కేవలం ఆతల్లుల దర్శనం చేసుకుంటే చాలు అనే విశ్వాసంతోనే జానపదులు మేడారానికి ఎడ్ల బండ్లలో వచ్చి కనీసం మూడు రోజులు బస చేస్తారు. నిజంగా పీ.ఆర్.ఓ కోణంలో చెప్పాలంటే సమ్మక్క, సారలమ్మ జాతర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టరుల కోసమే ఈ జాతర. నిరంతరం ప్రతి సూక్ష్మ అంశాన్ని ప్రజలకు తెలియ చేస్తారు. ఈ జాతర కవరేజికి డీ.పీ.ఆర్.ఓ కార్యాలయం నుండే దాదాపు వెయ్యి మీడియా పాస్ లు జారీచేయడం, దీనికి తోడు మరో రెండు వందలకు పైగా దేశ,విదేశీ జర్నలిస్టులు కవరేజి చేయడం,అధ్యయనం చేయడం,జాతర అంశాలను తమ కెమెరాల్లో బంధించడానికి వస్తారు. మేడారం జాతరలో మీడియా మేనేజ్మెంట్ అనేది అత్యంత ప్రధానమైనది, కీలకమైనది, సంక్లిష్టమైనది.

మతాలు వేరైనా, దేశాలు వేరైనా, పద్ధతులు వేరైనా సరే జాతరలు సహజంగా జరిగేవే.. కానీ ఏ జారతకూ లేని ప్రత్యేకతలు, అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో కనిపిస్తాయి. గలగల పారే సెలయేటిలో పుణ్యస్నానాలు చేసే కుంభమేళా లాంటి దృశ్యాలు ఇక్కడా కనిపిస్తాయి. గణగణమోగే గంటలు హిందూ దేవాలయాలు, క్రైస్తవ చర్చిలో వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండకోనల మధ్య జనసందోహం శబరిమలను తలపిస్తుంది. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించే మరో తిరుమల ప్రత్యక్షమవుతుంది. యుద్ధభూమిలో నేలకొరిగిన జాతి రత్నానికి భక్తకోటి నివాళులు మేడారంలో అర్పించే మరో జకార్తా, దైవత్వం సంతరించుకున్న మానవత్వం పుట్టిన మరో జెరూసలేం. ఇవన్నీ మనకు ఇక్క‌డ‌ కనిపిస్తాయి. కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే ఈ జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు దేవతలయ్యారు.

ఇంతటి, గొప్ప జాతర నిర్వహణలో భాగస్వామ్యం కావడం గొప్ప అవకాశం. సమాచార పౌర సంబంధాలశాఖలో 1993 లో APPSC ద్వారా సహాయ పౌర సంబంధాల అధికారిగా వరంగల్ లో జాయిన్ అయ్యాను. అప్పటినుండి, మొట్ట మొదటి సరిగా 1994 నుండి మేడారం జాతర విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాను. 2014 వరకు ప్రతీ జాతరకు ములుగు డివిజనల్ పీఆర్ఓ గా, వరంగల్ డీపీఆర్ఓ గా మేడారంలో మీడియా సెంటర్ ఇంఛార్జిగా భాద్యతలు నిర్వర్తించాను. పదోన్నతిపై హైదరాబాద్ కు వెళ్లినప్పటికీ ప్రతీ జాతరకు తప్పనిసరిగా వెళ్తూ అక్కడి జాతరలో గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలు, మొక్కులు, జాతర జరిగే తీరు, వివిధ రాష్ట్రాలనుండి వచ్చే గిరిజన జాతుల సంస్కృతీ సాంప్రదాయాలు, మీడియా కవరేజి, జాతరలో ఎదురయ్యే ఇబ్బందులు… ఇలా భిన్న అంశాలపై ఈ పుస్తకం త‌న అనుభ‌వాల‌తో రాసి,ముద్రించడం జరిగింది.

మేడారంలో జ‌రిగిన పుస్త‌కావిష్క‌ర‌ణ‌లో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, మేడారం వడ్డే పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ములుగు డిపిఆర్ఓ రఫీ తదితరులు ఈ ఆవిష్కరణ సభలో ఉన్నారు. మేడారం జాతర ను కళ్ళముందించేలా విస్తృత సమాచారంతో కూడిన ఈ సమ్మక్క గ్లోరీ ఆఫ్ మేడారం పుస్తకం విలువనించడం పట్ల రచయితను మంత్రి సీతక్క అభినందించారు.

ఇప్పటివరకు మేడారం పై రాసిన వ్యాసాల సంకలనాన్ని *సమ్మక్క – The Glory of MEDARAM * అనే పేరుతొ ప్రచురించడం జరిగింది. పుస్తకం కావాల్సిన వారు: 9849905900 , 9490396828
కన్నెకంటి వెంకట రమణ
జాయింట్ డైరెక్టర్, సమాచార శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *