NewsInn

News in a Click

నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలంగాణా పిటీష‌న్ డిస్మిస్- సివిల్ సూట్ వేయాల‌ని సూచ‌న‌

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)

నీటి వివాదాల‌తో ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు పంప‌కాల కోసం పోటీ ప‌డుతుండ‌గా తాజాగా సుప్రీం కోర్టు నిర్ణ‌యం మ‌రింత రాజ‌కీయ దూమారం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది. బ‌న‌క‌చ‌ర్ల నిర్మాణం అక్ర‌మం అంటూ తెలంగాణా లో రాజ‌కీయం రాజుకోవ‌డంతో తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల్లో కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా న‌ల్ల‌మ‌ల్ల సాగ‌ర్ పేరుతో కొత్త ప‌థ‌కాన్ని తెర‌పైకి తెచ్చింది. దీన్ని తెలంగాణాలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన బీఆర్ ఎస్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వం కూడీ ఈప‌థ‌కంపై ఆల‌స్యంగా స్పందించి అడ్డుకుంటామ‌ని ప్ర‌క‌టించి సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. తెలంగాణా ప్ర‌భుత్వం వారం రోజుల క్రితం ఈ పిటీష‌న్ దాఖ‌లు చేయ‌గా ఈ రోజు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ కేసును విచారించిన సుప్రీం తెలంగాణా ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటీష‌న్ విచార‌ణ‌కు అర్హ‌త లేద‌ని స్ప‌ష్టం చేసింది.ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు సుప్రీం అనుమతి ఇచ్చింది. దీంతో తాము పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని తెలిపిన తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి ప్ర‌క‌టించారు.రిట్ పిటీష‌న్ ఉప‌సంహ‌రించుకుని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపిన తెలంగాణ. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక వాదనలు కూడా వినాల్సి ఉందన్న సుప్రీంకోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *