NewsInn

News in a Click

నేరస్థుల సంఖ్య రాష్ట్రంలో బాగా పెరిగింది

డ్రగ్స్, సైబర్, డ్రంక్ అండ్ డ్రైవ్ ల కేసులు సంఖ్య పెరుగుదల

రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీనికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది.జైళ్ల శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక రాష్ట్రంలో నేరాలకు పాల్పడి జైళ్లకు వస్తున్న వారి వివరాల నేరాల సంఖ్య ను తేటతెల్లం చేస్తున్నాయి. 2024 తో పోలిస్తే ఈ రెండు నేరాలకు పాల్పడ్డ వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేరాలకు పాల్పడి జైల్లో ఉంటున్న వారి సంఖ్య దాదాపు రెట్టింపుబయింది. అదేవిధంగా నిందితులుగా జైల్లో ఉంటూనే శిక్షలు ఖరారు కావడంతో గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో శిక్షలు కూడా ఖరారయ్యాయి.
జైళ్ల శాఖ డీజీ.సౌమ్య మిశ్రా వార్షిక ఆ శాఖ పై వార్షిక నివేదికను విడుదల చేశారు.

ఆ నివేదిక ప్రకారం….

ఈ ఏడాది జైలుల్లో ఖైదీల అడ్మిషన్లలో 11.8% పెరిగాయి.

అందులో ఎక్కువగా సైబర్ నేరాలు, డ్రంక్ & డ్రైవ్ కేసులలో ఆదికంగా ఉన్నారు

2024లో 34,811 మంది ఖైదీలు ఉండగా, 2025 నాటికి 36,627 మంది ఖైదీలు ఉన్నారు

2024లో 3,229 మంది ఖైదీలు ఉండగా, 2025లో 5,856 మంది ఖైదీలకీ శిక్షి పడింది

సివిల్ కేసుల్లో 20 మందికి ఖైదీలు వచ్చారు

సైబర్ నేరాల్లో 2024 లో 757 ఖైదీలు 2025లో 1,784 ఖైదీలుగా ఉన్నారు

డ్రంక్ & డ్రైవ్ కేసులో 2024లో 1,124 మంది ఖైదీలు 2025లో 2,833 ఖైదీలు ఉన్నారు

మాదకద్రవ్యాల కేసులో 2024లో 6,311 మంది ఖైదీలు ఉండగా ఈ ఏడాది 7,040 మంది ఖైదీలు ఉన్నారు

పోక్సో చట్టం కేసులో 2024 3,750 మంది ఖైదీలు ఉండగా 2025 లో 4,176 ఖైదీలు ఉన్నారు

ఆస్తి నేరాల కేసులో 2024లో 7,679 మంది ఉండగా 2025లో 7,792 మంది ఖైదీలు ఉన్నారు

సైబర్ నేరాలు,డ్రంక్ & డ్రైవ్ కేసులు రెట్టింపు అయ్యాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *