మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
(న్యూఢిల్లీ,న్యూస్ఇన్)
గోదావరి నదిపై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు లో సూట్ దాఖలు చేయబోతున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం చేసిన మార్గదర్శనంకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున సూట్ వేయలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

రిట్ పిటిషన్ కంటే సూట్ ద్వారానే గోదావరి జలాలపై అంతర్ రాష్ట్రలతో సమగ్ర విచారణకు ఆస్కారం ఉంటుందన్న సుప్రీంకోర్టు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూట్ వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.పోలవరం-నల్లమల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టు లో దాఖలు పరిచిన రిట్ పిటిషన్ పై సోమవారం జరిగిన వాదనలకు ఆయన స్వయంగా హాజరయ్యారు.
అనంతరం సుప్రీంకోర్టు వెలుపల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్ రాష్ట్ర జల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నందున తెలంగాణాకు చెందాల్సిన న్యాయమైన నీటి వాటాను కాపాడుకోవడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.తెలంగాణాకు చెందాల్సిన ప్రతీ నీటి బొట్టును పరిరక్షించుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని,తెలంగాణా హక్కులను కాపాడుకోవడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన సూచనలకు అనుగుణంగానే రిట్ పిటిషన్ ను ఊపసంహరించుకున్నామని వెంటనే సూట్ దాఖలు చేయనున్నట్లు ఆయన వివరించారు.ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు ముమ్మాటికి నిబంధనలను ఉల్లంఘించడమే నని ఆయన తెలిపారు.





Leave a Reply