NewsInn

News in a Click

బీహార్ జ్యూవెలరీ వ్యాపారుల సంచలన నిర్ణయం

బీహార్ జ్యూవెలరీ వ్యాపారుల సంచలన నిర్ణయం

(న్యూఢిల్లీ, న్యూస్ఇన్)

బీహార్ జ్యూవెలరీ వ్యాపారుల సంచలన నిర్ణయం తీసుకున్నారు.

హిజాబ్, మాస్క్‌ తో వచ్చిన మహిళలు తమ మొహం కనిపించేలా దుకాణానికి వస్తేనే బంగారు నగలు చూపించాలని లేదంటే చూపించరాదని నిర్ణయం తీసుకున్నారు.

గత కొన్ని రోజులుగా దొంగతనాలకు పాల్పడిన సందర్భాల్లో సీసీటీవీల్లో చూసి తర్వాత వారిని గుర్తించడం చాలా కష్టంగా మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖిలభారత ఆభరణాలు, స్వర్ణకారుల సమాఖ్య(ఏఐజేజీఎఫ్‌) బిహార్‌ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఏఐజేజీఎఫ్‌ బిహార్‌ విభాగ అధ్యక్షుడు అశోక్‌ వర్మ పట్నాలో మీడియాతో మాట్లాడారు.

” ముఖం కన్పించకుండా హిజాబ్, మాస్క్‌ వంటివి ధరించి నగల దుకాణంలోకి వచ్చిన వారికి మేం నగలను చూపించరాదని. ముఖం చూపిస్తేనే మా దుకాణాల్లోని నగలను మేం చూపిస్తాం. మా నగల, కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికొచ్చాం” అని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ముఖం కన్పించకుండా, వినియోగదారుల్లా దుకాణాల్లోకి అడుగుపెట్టిన కొంతమంది దొంగలు కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చాకచక్యంగా కొట్టేయడం తెల్సిందే. తర్వాత సీసీటీవీల్లో పోలీసులు, నగల వ్యాపారులు పరిశీలించినా దొంగలను గుర్తుపట్టలేని పరిస్థితి దాపురించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *