NewsInn

News in a Click

తగ్గు ముఖం పట్టిన చలి తీవ్రత…..!

(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలంగాణను గత నెల రోజులుగా గజగజ వణికించిన చలి తీవ్రత తగ్గు మోహం పట్టింది. చలి ఈసారి సంక్రాంతి పండగ నుంచే చలి ప్రభావం తగ్గుతుంది.సాధారణంగా శివరాత్రి వరకు కొనసాగాల్సిన చలిగాలుల స్థానంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలకు చలి నుంచి ఉపశమనం దక్కుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 29 నుంచి 31 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది.
రాష్ట్రంలో కొనసాగుతున్న ‘కోల్డ్‌వేవ్ 2.0’ (రెండో దశ చలిగాలులు) ముగిసిందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే వారం పది రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉంటాయని, తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం లేదని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని అధికారులు వివరించారు.

ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌లో వాతావరణం స్వల్పంగా మారనుంది. సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని బీదర్ సరిహద్దు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత కొంత వున్నా, పగటి పూట మాత్రం సాధారణ వేడి కొనసాగనుంది. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల పగటిపూట పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల మధ్యాహ్న సమయాల్లో ఎండ ప్రభావం కొంత అధికంగా అనిపించే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *