కల్వకుంట్ల కవితతో సుదీర్ఘ చర్చలు
కలిసి పనిచేసందుకు పీకే గ్రీన్ సిగ్నల్
పీకే దిశా నిర్దేశంలో కవిత పొలిటికల్ అడుగులు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఎన్నికల ఇంజనీరింగ్ లో దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ప్రశాంత్ కిషోర్ తెలంగాణా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘ పాదయాత్ర చేసి బీహార్ ఎన్నికల్లో తన మార్క్ వేసుకోలేకపోయిన ప్రశాంత్ కిషోర్ ను ప్రధాన రాజకీయాలు తమను గెలిపిస్తారన్న నమ్మకంతో ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని రా|ష్ట్రాల్లో పార్టీలు ఊహించిన ఫలితాలు కూడా ఆయన ఎలక్షన్ ఇంజనీరింగ్ తో రాజకీయ పార్టీలు దక్కించుకున్నాయి. తెలంగాణా రాజకీయాల్లో పట్టు భిగించాలని చూస్తున్న తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా ప్రశాంత్ కిషోర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉండడంతో ప్రశాంత్ కిషోర్ టీంకు ఆమె రాజకీయ పార్టీ భవిష్యత్తును తీర్చి దిద్దే బాధ్యతలు అప్పగించేందుకు కవిత రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కవిత ప్రారంభించ బోయే పార్టీతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ కూడా ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా పీకే స్వయంగా హైదరాబాద్ కు వచ్చి కవితో పలు మార్లు భేటీ అయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా మరోసారి కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనే దాదాపు ఐదు రోజుల ప్రశాంత్ కిషోర్ మకాం వేసి కవితతో భవిష్యత్ రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీ ప్రారంభించేందుకు సిద్ధం అవుతన్న కవిత తెలంగాణా రాజకీయాలపై సుదీర్గంగా పీకేతో చర్చించినట్లు సమాచారం. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతామని కవిత గతంలో నే ప్రకటించారు. అందుకు అనుగుణంగా పీకే తో ఎలాంటి వ్యూహాలతో రాష్ట్రంలో ముందుకు వెళ్లాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ విధివిధానాలు, ప్రాధాన్యతలను గుర్తించేందుకు పలు కమిటీలను నియమించిన కవిత ఆ కమిటీల నివేదిక ఆధారంగా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. తెలంగాణా ప్రజలతో మమేకం అయ్యేందుకు ఏ ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి…. ప్రజల మద్దతు కూడ గట్టాలంటే ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న లక్ష్యంగా పలు వర్గాలతో కవిత వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ నినాదాన్ని చేస్తున్న కవిత క్షేత్ర స్థాయి అంశాలపైనే ప్రధానంగా దృ ష్టి పెట్టారు. తెలంగాణా రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ 2023 ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ కోసం పనిచేయాలని చర్చలు జరిపినా చివరి నిమిషంలో సయోధ్య కుదరకపోవడంతో ఆ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీతో పనిచేసే అవకాశం పీకే బృందానికి దక్కలేదు. పీకే బృందంలో కీలక బాథ్యతలు నిర్వహించిన సునీల్ కనుగోలు రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి ఆ పార్టీ విజయం కోసం వ్యూహాలను అమలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడీ సునీల్ కనుగోలు వ్యూహాలతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ వ్యూమాలు అమలు చేసింది. తాజాగా ప్రశాంత్ కిషోర్ తెలంగాణా ఎన్నికల ను టార్గెట్ చేసేందుకు రెడీ అవుతుండండతో వచ్చే ఎన్నికలపై పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పటి నుంచే చర్చలు మొదలయ్యాయి.



Leave a Reply