NewsInn

News in a Click

మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు… కొత్త అనుమానాలు

మంత్రుల‌పై ఆరోప‌ణ‌లు… కొత్త అనుమానాలు

రాస‌లీల‌ల క‌థ‌కు….బొగ్గు మ‌ర‌క‌ల ట్విస్ట్

పాత కాంగ్రెస్ నేత‌ల‌ శాఖ‌ల్లోనే అవ‌క‌త‌వ‌క‌లా…?

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కొత్త ఏడాది మొద‌ట్లోనే అధికార కాంగ్రెస్ పార్టీని వివాదాలు చుట్టుముట్టాయి. ఆపార్టీలోని విబేధాలు నేరుగా బ‌య‌ట‌కు రాక‌పోయినా ఓ మంత్రి రాసలీలలు అంటూ మీడియా సంస్థ ప్ర‌సారం చేసిన వార్గ కాంగ్రెస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాలను బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. రాస‌లీల‌ల క‌థ మూడు రోజుల్లో మ‌రో మ‌లుపు తీసుకుంది. ఇది బొగ్గు గ‌నుల మ‌ర‌క‌గా మ‌రో మీడియా సంస్థ బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఇందులో వాస్త‌వాలు ఎలా ఉన్నా…. రాజ‌కీయ వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేత‌ల తీరు మాత్రం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది.ఈ రెండు మీడియా సంస్థ‌లు ఒకే సామాజిక వ‌ర్గానికి చెందినవి కాగా ఒక మీడియా సంస్థ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అత్యంత స‌న్నిహితంగా ఉంటార‌న్న పేరు ఉంది. మ‌రో మీడియా సంస్థ‌కు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌న్నిహితంగా ఉంటార‌న్న పేరుంది. ఈ నేప‌థ్యంలో సిఎంకు స‌న్నిహితంగా ఉంటార‌ని పేరున్న ప‌త్రిక‌లో ఆ ప్ర‌తికాధినేత స్వ‌యంగా నిర్వ‌హించే కాలంలో పోటీ సంస్థ‌కు ద‌గ్గ‌రగా ఉండే భ‌ట్టి విక్ర‌మార్క సహా, ఆ మీడియా సంస్థ య‌జ‌మాని, అల్లుడి ప్ర‌మేయం ఉంద‌ని ఈ కార‌ణంగా టెండ‌ర్ల విధానంలో మంత్రి సంస్థ‌కు ద‌క్క‌కుండా డిప్యూటీ త‌న శాఖ ద్వారా కొత్త నిబంధ‌న‌లు అమ‌లు చేసి చ‌క్రం తిప్పార‌ని సీఎంకు ద‌గ్గ‌రగా ఉండే మీడియా సంస్థ అధినేత వెల్ల‌డించారు. ఈ వ్య‌వ‌హారం కార‌ణంగా ఈ వివాదానికి కార‌ణ‌మైంద‌న్న విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు. అస‌లే కాంగ్రెస్ పార్టీ ఆ పై డిప్యూటీ సీఎం మ‌రి సైలెంట్ గా ఎలా ఉంటారు….త‌న రాజ‌కీయ అనుభవాన్ని వివ‌రిస్తూ……. త‌న‌పై వార్త రాసిన సంస్థ య‌జ‌మానిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు…నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే టెండ‌ర్లు నిర్వ‌హిస్తార‌ని చెప్పుకొచ్చారు.నిబంధ‌న‌ల్లో మార్పుల గురించి డిప్యూటీ సీఎం అధికారులు తీసుకునే నిర్ణ‌యంగా చెప్పుకొచ్చారు.

ఇక సీఎంకు ద‌గ్గ‌ర‌గా ఉండే మీడియా సంస్థ‌లో వ‌చ్చిన వార్త‌పై స్వ‌యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించ‌క త‌ప్ప‌లేదు. మీడియా సంస్థ‌ల మ‌ధ్య వైరం ఉంటే మీరే తేల్చుకోవాల‌ని త‌న మంత్రి వ‌ర్గంలో ఏవ‌రిపైనా వార్త‌లు రాసే మందు త‌నతో వివ‌ర‌ణ తీసుకోవాల‌ని త‌న మంత్రి వ‌ర్గంలో మంత్రులంతా నిజాయితీగా ప‌నిచేస్తున్నార‌ని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్న రాజ‌కీయ పార్టీల నేత‌లు, అధికారుల‌పై చిన్న చిత‌కా ఆరోప‌ణ‌లు రావ‌డం స‌హ‌జం కానీ…… వేలాది కోట్ల రుపాయాల ఆదాయాన్ని తెచ్చి పెట్టే బొగ్గు గ‌నుల వ్య‌వ‌హారంలో అర్హ‌త లేని సంస్థ‌లు ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డం ఆ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉండే పెద్ద‌లు స‌హ‌క‌రిస్తుండ‌డం వంటి అంశాలు తెర‌పైకి రావ‌డం ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.డిప్యూటీ సీఎం నిర్వ‌హించే శాఖ‌లో జ‌రుగుతున్న వ్యవ‌హారం సీఎం స‌న్నిహిత మీడియా సంస్థ‌కు ఎలా చేరాయాన్న‌దానిపై ఎప్పుడు డిప్యూటీ వ‌ర్గంలో జ‌రుగుతున్న ప్ర‌ధాన చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియ‌ర్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న శాఖ‌ల‌పైనే ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. పొన్నం ప్ర‌భాక‌ర్, దామోద‌ర రాజ‌న‌ర్సింహా, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, తాజాగా భ‌ట్టి విక్ర‌మార్క‌లు నిర్వ‌హిస్తున్న శాఖ‌ల‌పై వివాదాలు చుట్టుముడుతుండ‌డం వెనుక ఎదో రాజ‌కీయం జ‌రుగుతుంద‌న్న అనుమానాలు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ల‌ను వెంటాడ‌తున్నాయి. తాజాగా వెలుగు చూసిన బొగ్గు గ‌నుల టెండ‌ర్ల వ్య‌వ‌హారం అతి పెద్ద అంశం కావ‌డంతో కాంగ్రెస్ పార్టీ హై క‌మాండ్ కూడా దీనిపై ఆరా తీస్తున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు అమాత్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ తాము నిర్వ‌హిస్తున్నశాఖ‌ల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై సీరియ‌స్ గా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే హై క‌మాండ్ కు అన్ని విష‌యాల‌ను తెలియ‌చేయాల‌ని సీనియ‌ర్ నేత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్య‌వ‌హారం విప‌క్షాల‌కు కొత్త అస్త్రాల‌ను అందిస్తోందన్న అభిప్రాయాన్ని ప‌లువురు అధికార పార్టీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *