NewsInn

News in a Click

అభ్య‌ర్థుల ఎంపికపై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

అభ్య‌ర్థుల ఎంపికపై కాంగ్రెస్  క‌స‌ర‌త్తు

అభ్య‌ర్థుల‌ ఎంపిక కోసం క‌మిటీలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. నిన్న‌టి మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో క్షేత్ర స్థాయిలో ప‌నులు మొద‌లు పెట్టింది. అభ్య‌ర్థుల‌ ఎంపిక కోసం క‌స‌ర‌త్తు మొదలు పెట్టింది. మున్సిప‌ల్ కార్పోరేష‌న్లు, మున్సిపాల్టీలో పోటీ చేసే అభ్య‌ర్థుల‌ కోసం టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో స్క్రీనింగ్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు పీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ ప్ర‌క‌టించారు. పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో క‌మిటీల ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్రతి పార్లమెంట్ కు ఇంచార్జ్ మంత్రి చైర్మన్ గా, పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కన్వీనర్ లుగా, పార్లమెంట్ నియోజక వర్గంలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, సీనియర్ నాయకులతో కమిటీని ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

త్వ‌ర‌లో ఈ క‌మిటీ రిజ‌ర్వేష‌న్ల‌కు అనుగుణంగా అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను మొద‌లు పెట్ట‌నుంది. ఒక్కో వార్డు లేదా డివిజ‌న్ నుంచి ఆరు గురు అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో ఒక్కో వార్డు లేదా డివిజ‌న్ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించి, వారిలో ఆరుగురు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. వారిలో ఒక్క అభ్య‌ర్థిపై తుది నిర్ణ‌యం పార్టీ తీసుకోనుంది. క‌మిటీ ఆధ్వ‌ర్యంలో అభ్య‌ర్థులను ఎంపిక చేయ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *