NewsInn

News in a Click

స‌ర్కార్ కు మ‌న శంక‌రవ‌ర ప్ర‌సాద్ షాక్

స‌ర్కార్ కు మ‌న శంక‌రవ‌ర ప్ర‌సాద్ షాక్

మూడు నెల‌ల ముందే సినిమా టికెట్ల రేట్లపై నిర్ణ‌యం

తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపు విష‌యంలో హై కోర్టు కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది. సినిమా విడుదల‌కు ముందు రోజు హ‌డావుడిగా టికెట్ ధ‌ర‌ల పెంపుపై వేసిన పిటీష‌న్ ను హై కోర్టు విచారించి ప్ర‌భుత్వ తీరును త‌ప్ప‌బట్టింది. ఒక్కో సినిమాకు ఒక్కో ర‌కంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుండాన్ని పిటీష‌న‌ర్ ప్ర‌స్తావించడంతో ఇటీవ‌ల విడుద‌లన సినిమాల విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై హై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు సుమోటోగా హోం శాఖ‌ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసింది.మన శంకర వర ప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులే వివాదానికి ప్ర‌ధాన కారణంగా మారిన‌ట్లు తెలుస్తోంది.ఈ నెల 8వ తేదీన ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేసి, 10 జనవరి నుంచి అమలు చేయాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 9వ తేదీన రాజాసాబ్ సినిమా విచార‌ణ స‌మ‌యంలో ఈ స‌మాచారం కోర్టుకు ప్ర‌భుత్వం స‌మాచారం ఇవ్వ‌లేదు.దీనిపై కోర్టు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. రాబోయే రోఉల్లో చ‌ట్ట ప్ర‌కారం త‌ప్ప ధ‌ర‌ల పెంపు ఉత్త‌ర్వులు ఇష్టాను సారంగా ఇవ్వ‌రాద‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.ఇకపై సినిమా టికెట్ ధరల పెంపు నిర్ణయం విడుదలకు 90 రోజుల ముందే తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ యాక్ట్ – 1955 ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్ నంబర్: WP No.1518 of 2026 పిటిషనర్ తరఫున అడ్వకేట్ విజయ్ గోపాల్ వాద‌న‌లు వినిపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *