NewsInn

News in a Click

మున్సిపోల్స్ బ‌రిలో క‌విత పార్టీ అభ్య‌ర్థులు.. ?

మున్సిపోల్స్ బ‌రిలో క‌విత పార్టీ అభ్య‌ర్థులు.. ?

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల బ‌రిలో కొన్ని చోట్ల తెలంగాణా జాగృతి త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించేందుకు ఆ పార్టీ అధినేత్రి క‌ల్వ‌కుంట్ల క‌విత ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై ప‌లువురు స్థానిక నేత‌ల‌తో అమె చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. స్థానికంగా ప‌ట్టు నిలుపుకోవాల‌న్న ఉద్దేశ్యంతో ఆమె ప్రాతినిథ్యం వ‌హించిన నిజామాబాద్ జిల్లాలోనే అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించాల‌న్న అభిప్రాయంతో క‌విత ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లు కావ‌డంతో ఈ ఎన్నిక‌ల నుంచే పార్టీ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌న్న యోచ‌న‌లో క‌విత ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఎంపీగా ఆమె గ‌తంలో విజ‌యం సాధించారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా కూడా అక్క‌డిన ఉంచే ఎన్నిక‌య్యారు. ఆమె స్వ‌గ్రామం కూడా నిజామాబాద్ స‌మీపంలోనే ఉండ‌డంతో మున్సిప‌ల్ ఎన్నిక‌ల శంఖారావాన్ని నిజామాబాద్ నుంచే క‌విత పార్టీ అభ్య‌ర్థులు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. గ‌త రెండు,మూడు రోజులుగా ఇదే అంశంపై స్థానిక పార్టీ నేత‌ల‌తో అధినేత్రి వ‌రుస‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా పార్టీ పేరు, విధి, విధానాలు ఖ‌రారు కాక‌పోయినా…వ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులు కోరాద‌న్న అభిప్రాయంతో క‌విత ఉన్న‌ట్లు స‌మ‌చారం.పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించితే…. ప్ర‌త్యామ్నాయంగా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న చ‌ర్చ‌లు కూడా క‌విత చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణా జాగృతి పేరుతోనే పార్టీ పేరు ఉంటుందా…కొత్త‌గా పార్టీకి మ‌రేదైన పేరు ఖ‌రారు చేయాలా అన్న దానిపై కూడా క‌విత చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. పార్టీ విధి విధానాలు, క్షేత్ర స్థాయిలో ఉన్న ప‌రిస్థితుల‌ను అధ్య‌య‌నం చేసి నివేదిక‌ల‌ను ఇచ్చేందుకు ప‌లు క‌మిటీల‌ను క‌విత నియ‌మించింది. దాదాపు 50 క‌మిటీలు వివిధ వ‌ర్గాల‌తో బేటీఅయిన త‌రువాత ఇందుకు సంబంధించిన నివేదిక‌ల‌ను క‌మిటీ నివేదిక‌ల‌ను కూడా అధినేత్రికి క‌మిటీ స‌భ్యులు స‌మ‌ర్పించారు. అన్ని క‌మిటీలు క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను వివ‌రిస్తూ రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేయాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ త‌మ నివేదిక‌ల‌ను అందించిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో వ‌స్తున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీపై తొంద‌ర‌పాటు నిర్ణ‌యం వ‌ద్ద‌న్న అభిప్రాయం కూడా ప‌లువురు వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోక‌పోయినా మున్సిప‌ల్ ఎన్నిక‌లకు కేవ‌లం ఒక నెల రోజుల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉండ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా కాక‌పోయినా నిజామాబాద్ లేదా ఆ జిల్లాల్లోని మున్సిపాల్టీలో క‌విత‌కు బ‌ల‌మైన అన‌చ‌రులు ఉన్న ప్రాంతాల్లోనే అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించే అంశాన్ని కూడా కవిత ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *