లేదంటే రేవంత్, సృజన్ రెడ్డిలు కుంభకోణం చేసినట్లే
హరీష్ కు అండగా పార్టీ
పోలీసుల విచారణ అనంతరం హరీష్ రావ్
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావ్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో నోటీసులు ఇచ్చి మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడంతో మాజీ మంత్రి హరీష్ రావ్ హైదరాబాద్ లో లేకపోయినా….హుటా హుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం నుంచి హరీష్ నివాసం దగ్గర సందడి నెలకొంది. పోలీసులు ఇచ్చిన నోటీసులపై సుదీర్ఘంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా నేతలతో చర్చించారు. ఉదయం 10 గంటల వరకు తెలంగాణా భవన్ కు హరీష్ రావ్, కేటిఆర్ లు చేరుకున్నారు. పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణా భవన్ కు చేరుకోవడంతో పార్టీ కేంద్ర కార్యాలయం హడావుడిగా కనిపించింది. 10.30 గంటల ప్రాంతంలో తెలంగాణా భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు బయలు దేరిన హరీష్ రావ్ వెంట పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు బయలు దేరారు.

పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాకుండా పోలీసులు బీఆర్ ఎస్ నేతలను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయినా పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఉంటూ తమ నేతకుమద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో తెలంగాణా భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సహా కీలక నేతలు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ వచ్చారు. 11 గంటల నుంచి సాయంత్రం వరకు పోలీసులు హరీష్ రావ్ ను విచారించి సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ రోజు విచారణ పూర్తి అయినట్లు తెలియచేసి హరీష్ రావ్ ను బయటకు పంపారు…….
మేం అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ…అంతా కక్కిస్తాం
అనంతరం తెలంగాణా భవన్ లో బీఆర్ ఎస్ ఎల్పీ నేత హరీష్ రావ్ కోసం సాయంత్రం వరకు ఉన్న కేటిఆర్ సహా కీలక నేతలంతా హరీష్ కు సాదర స్వాగతం పలికారు. విచారణ జరిగిన తీరుపై నేతల మధ్య చర్చలు ఆసక్తి కరంగా జరిగాయి….. అనంతరం హరీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విచారణ జరిగిన తీరును వివరించారు. అధికారులు విచారణ కోసం పిలిచి అడిగిందే అడుగుతూ కాలక్షేపం చేసినట్ల వెల్లడించారు. విచారణ అధికారులు అరగంటకోసారి ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లి వచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కుంభకోణం బయటపెడితే పోలీసులు ఫోన్ ట్యాపింగ్ లో విచారణ నోటీసులు ఇచ్చారన్నారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే హై కోర్టు సిట్టింగ్ జడ్జిత్ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.

రేవంత్ బావమరిది సింగరేణి కుంభకోణాల్లో మొదటి దోషి అని అన్ని ఆధారాలు హై కోర్టు జడ్జికి అన్ని ఆధారాలు ఇచ్చేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు. ప్రభుత్వంలోని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, భట్టి విక్రమార్కల బండారం బయటపడిందని దీంట్లో సృజన్ రెడ్డి కూ భాగస్వామే అన్నారు. అక్రమ కేసులు, విచారణలు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని హరీష్ అన్నారు. తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కొట్టి వేసినా మరోసారి నోటీసులు ఇచ్చి సిట్ పేరుతో విచారణ జరుడం విడ్డూరంగా ఉందన్నారు. రుణమాఫీ ఎక్కడ అంటే యాదాద్రిలో కేసు పెట్టారని, ఎగవేతల రేవంత్ అంటే మానకొండురులో మరో కేసు, ఖమ్మం వరదబాధితులను పరామర్శిస్తే అక్కడ ఇంకో కేసు పెట్టారని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి దోపిడీ చేసేందుకు తెగబడ్డారని విమర్శించారు. ప్రభుత్వ దోపిడిని అడ్డుకునేందుకు కేటిఆర్, నేను బీఆర్ఎస్ నేతలు అడ్డు పడుతుంటే కేసులు, విచారణ పేరుతో తమనోరు నొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు.

మీ నోటీసులకు సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధమే….. కానీ రేపు ప్రజా కోర్టులో సమాధానాలు ఇవ్వడానికి నువ్వు సిద్దంగా ఉండాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.నాకు చట్టంపై గౌరవం ఉంది కానీ,…..నీ చిల్లర రాజకీయాలపై అసహ్యం ఉందని సీఎం ను ఉద్దేశించి హరీష్ వ్యాఖ్యలు చేశారు.
సింగరేణిలో జరిగిన కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించకపోతే….మీ బామ్మర్ది, నువ్వు చేసిన కుంభకోణం నిజం, అవినీతి జరిగింది నిజం అని భావిస్తాం అని హరీష్ రావ్ అన్నారు.లేదంటే రెండేళ్లలో వచ్చేది బిఆర్ఎస్ పార్టీనే. నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణంపై, అవినీతిపై విచారణ జరిపిస్తాం, అంతా కక్కిస్తాం.








Leave a Reply