NewsInn

News in a Click

అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి

అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి

లోకల్ బ్రాండ్ కోసం ఎంఎస్ఎంఇ ల‌కు ప్రొత్సాహం

దావోస్ లో సీఎం చంద్రబాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

అభివృద్ధి అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదని… అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి… అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానానికి శ్రీకారం చుట్టింద‌న్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో భాగంగా పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. వివిధ చర్చా వేదికల్లో పాల్గొన్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంపై ప్రపంచ ఆర్థిక సదస్సులో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…”అభివృద్ధిలో అందర్నీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతోనే ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి… ఓ తరం అభివృద్ధి చెందాలి. నా ఆలోచన ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే టెక్నాలజీలను, పరిణామాలను అందిపుచ్చుకునేలా ఆలోచన చేయాలి. భారతదేశం ఇప్పుడు ఉత్పత్తి రంగం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దాన్ని అందిపుచ్చుకునే దిశగా మేం ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం.”అని సీఎం వెల్లడించారు.

గైడెన్స్ ఇస్తూ…ఇన్ఫ్రా ఏర్పాటు చేస్తున్నాం

“ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ అనే విధానం తేవడమే కాదు… దానికి అవసరమైన గైడెన్స్ ఇస్తున్నాం, మౌళిక వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలకు, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ ద్వారా పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి గైడెన్స్ ఇస్తాం. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ఇన్ఫ్రాను సిద్దం చేస్తున్నాం. అలాగే వినూత్న ఆలోచనలతో ఉన్న వారిని ప్రొత్సహించేందుకు పీ-4 అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. పీ4 ద్వారా పేదరికాన్ని తగ్గించడంతోపాటు… కొత్త ఆలోచనలు ఉన్న వారికి చేయూత ఇచ్చే విధంగా కూడా వ్యవస్థను తీర్చిదిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *