NewsInn

News in a Click

ఢిల్లీకి, ఫాంహౌజ్ కు మధ్య ఇంకా డీల్ కుదరలేదా ?

కేంద్ర మంత్రి బండి సంజయ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ పేరుతో జ‌రుగుతున్న తాత్సారాన్ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌ప్పు బ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఫోన్ ట్యాపింగ్ కేసును రెండేళ్లుగా పొడ‌గిస్తూ వ‌స్తోంద‌ని ఆరోపించారు. ట్యాపింగ్ పేరుతో అధికార పార్టీ డ్రామా చేస్తోంద‌న్నారు. ఢిల్లీకి, ఫాం హౌస్ మ‌ధ్య డీల్ కుద‌ర‌క‌పోవ‌డంతోనే ఇంకా ఈ వ్య‌వ‌హారం ముందుకు వెళుతోంద‌ని ఆరోపించారు. కేసులో సూత్ర‌ధారులుగా ఉన్న తండ్రి, కొడుకుల‌ను ఎందుకు విచారించ‌డం లేద‌ని సంజ‌య్ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ట్యాపింగ్ కు కార‌ణ‌మైన ఒక్క నేత‌నైనా అరెస్టు చేయ‌లేద‌న్నారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారంటూ హరీష్ రావు గతంలో చెప్పిన విష‌యాన్ని బండి సంజ‌య్ గుర్తు చేశారు. రెండేళ్లుగా సాగుతున్న విచారణలో కొండను తవ్వి కనీసం ఎలుకను కూడా పట్టేకపోయారన్నారు. కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ప్రజా సమస్యల నుండి ద్రుష్టి మళ్లించేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ వాడుకుంటుంద‌ని ఆరోపించారు. ఇది చూస్తుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలదాకా ఫోన్ ట్యాపింగ్ కేసును సాగదీసేలా ఉంద‌న్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ సూత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *