-సీఎం చంద్రబాబు
(అమరావతి, న్యూస్ఇన్)
ఇరాన్ యుద్ధ వాతావరణతో దేశ వ్యాప్తంగా ఎల్పీజీ కొరత అంటూ గ్యాస్ సిలిండర్లకు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితులో ఏపీ సీఎం ఏపీకి అదనంగా గ్యాస్ కేటాయింపులు దక్కేలా చక్రం తిప్పారు. ఈ రోజు ఆర్టీజి ఎస్ ద్వారా సమీక్ష నిర్వహించిన సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 15 రోజులకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ ఉంటే.. అదనంగా మరో 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ విశాఖలో అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులూ లేవని సీఎం స్పష్టం చేశారు. ఈకేవైసీ, ఓటీపీల సాయంతో గ్యాస్ సిలెండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చూడాలని ప్రజలకు ఇబ్బందులు లేకుండా పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్యాస్ కంపెనీలు స్వల్ప కాలికంగా ఉత్పత్తి పెంచటంతో పాటు పంపిణీ కూడా మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. ప్రత్యేకించి గ్యాస్ సిలెండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు కుదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు కొరతా లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ విస్తృతికి చర్యలు…
ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్డ్ గ్యాస్ కనెక్షన్లు, నెట్వర్క్ పెంపు పైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరింతగా విస్తరించే అంశంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువును పైప్డ్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు సరఫరా చేసే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని గరిష్టంగా పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఏపీ వన్ యాప్ ద్వారా సేవలు….
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులను సెన్సిటైజ్ చేయాలని సీఎం సూచించారు. సిటిజన్ సేఫ్టీ అవేర్నెస్ కింద వారికి సంక్షిప్త సమాచారాన్ని పంపించాలని అన్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు లింక్ ను యాప్ ద్వారా లేదా వాట్సప్ గవర్నెన్సు ద్వారా వినియోగదారులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రూపోందిస్తున్న ఏపీ వన్ యాప్ ను త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు. డేటా లేక్, అవేర్ ను ప్రభుత్వ శాఖలు ఏమేరకు వినియోగించుకున్నది గుర్తించాలని సీఎం సూచించారు. వేసవిలో అవేర్ ద్వారా సమాచారం తీసుకుని తాగునీరు, హీట్ వేవ్స్, పశుగ్రాసం సహా వివిధ అంశాలపై ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలో లోకేష్ ….







Leave a Reply