-ప్రారంభించిన మంత్రి సింధియా
(హైదరాబాద్,న్యూస్ఇన్)
దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో పోస్టల్ శాఖ కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. 24 గంట్లో డెలివరీ చేయడం, 48 గంటల్లో చేరవేయడం వంటి సేవల్లోకి తపాలా శాఖ ఎంటర్ అయింది. ఈ సేవలను కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా మంగళవారం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలను అమలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు నగరాలకు విస్తరించడంతో, ఏడాదిలోపు దేశ వ్యాప్తంగా ఈ సేవలను అందించే విధంగా తపాలాశాఖ దృష్టి సారిస్తుందన్నారు. ప్రస్తుతానికి ఆరు మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

దేశంలో తపాలా శాఖకు ఉన్న నెట్ వర్క్ ఎవరికి లేదని, సామాన్యడికి తపాలా శాఖ భరోసా అని మంత్రి వ్యాఖ్యానించారు. సేవల ను పకడ్భంధీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సేవలు జాతీయ సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటాయన్నారు. దేశంలోని 6.5 లక్షల గ్రామాలకు చేరుకునే విధంగా పోస్టల్ శాఖ నెట్ ఉందని దేశ వ్యాప్తంగ 1,65 వేల పోస్టాఫిసులు మారు మూల గ్రామాల్లో సైతం ఉన్నాయన్నారు. ప్రస్తుతం దేశంలో ఈ కామర్స్ విలువ 11 లక్షల కోట్లని, 2030 నాటికి 30 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయన్నారు. ఈ మూడు రకాల సేవలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణీత ధరలను ఖరారు చేసింది.

చరిత్రలో మైలురాయి…..
ఈ సందర్భంగా తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ వీణా కుమారి డెర్మల్ మాట్లాడుతూ.. ఈ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం పోస్టల్ సేవల చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. రిటైల్, బిజినెస్ వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడానికి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇండియా పోస్ట్ కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఈ కొత్త సేవలు ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. హైదరాబాద్లో 38 బుకింగ్ కార్యాలయాలు, 94 డెలివరీ కార్యాలయాలు ’24 స్పీడ్ పోస్ట్స్’, ’24 స్పీడ్ పోస్ట్ పార్శిల్’ సేవలను నిర్వహిస్తాయని, అలాగే ’48 స్పీడ్ పోస్ట్’ సేవలను 176 బుకింగ్ కార్యాలయాలు, 94 డెలివరీ కార్యాలయాలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఈ సేవల కింద వచ్చే అన్ని కన్సైన్మెంట్లను ప్రాధాన్యతగా పరిగణిస్తామని తెలిపారు.

’24 స్పీడ్ పోస్ట్’ సేవలు ప్రత్యేకంగా డాక్యుమెంట్ల డెలివరీ కోసం రూపొందించారు. బుక్ చేసిన మరుసటి రోజు కల్లా డాక్యుమెంట్ల డెలివరీ పూర్తవుతుంది. ’24 స్పీడ్ పోస్ట్ పార్శిల్’ సర్వీసు 5 కేజీల వరకు ఉండే పార్శిళ్ల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇవి కూడా మరుసటి రోజు కల్లా డెలివరీ అవుతాయి. ’48 స్పీడ్ పోస్ట్’ సర్వీసు ద్వారా 48 గంటలలోపు డాక్యుమెంట్ల డెలివరీ జరుగుతుంది. డెలివరీలో ఆలస్యమైతే కొన్ని షరతులకు లోబడి నగదు వాపసు సౌకర్యాన్ని సైతం తపాళా శాఖ అందిస్తుంది.

ట్రాకింగ్ అవకాశం……
ప్రత్యేక ప్యాకేజింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్లతో కూడిన ఎండ్-టు-ఎండ్ ట్రాకింగ్, వ్యాపార వినియోగదారుల కోసం ‘ముందు బుక్ చేసి తర్వాత చెల్లించే’ సౌకర్యం, ఉచిత పికప్ సేవలు, ఓటీపీ ఆధారిత సురక్షిత డెలివరీ, ఏపీఐ ఇంటిగ్రేషన్ వంటివి అదనపు ఫీచర్లు కూడా ఈ మూడు సేవల్లో ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎం.ఎస్. సుమితా అయోధ్య, హెడ్క్వార్టర్స్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఎన్.ఆర్. విశాలాక్షి, తెలంగాణ సర్కిల్ పోస్టల్ అకౌంట్స్ డైరెక్టర్ సంపర్, హెడ్క్వార్టర్స్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ రిప్పన్ దుల్లెట్, హెచ్.ఆర్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ వై. నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపి కి అదనంగా గ్యాస్ కేటాయింపు…..







Leave a Reply