ఇంచార్జ్ లను నియమించిన బీజెపి
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పర్యవేక్షణకు ఇంఛార్జీని ప్రకటించింది.మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆశిష్ షెలార్ను రాబోయే తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే పలు రాష్ట్రాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి నితిన్ దృష్టి సారించారు. జనవరి 29న జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను పార్టీ పరిశీలకునిగా నియమించారు. రాబోయే గ్రేటర్ బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ను పార్టీ ఇన్ఛార్జ్గా నితిన్ నబీన్ నియమించారు.

తెలంగాణా మున్సిపల్ ఎన్నికల కోసం….
మహారాష్ట్ర మంత్రిగా ఆశిష్ షెలార్ను రాబోయే తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ ఇన్ఛార్జ్గా నితిన్ నబీన్ నియమించారు. రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, బీజేపీ రాజ్యసభ ఎంపీ రేఖా శర్మలను సహ-ఇన్ఛార్జ్లుగా ప్రకటించారు.త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతర్గత సర్వేలు కూడా నిర్వహించింది. అంతేకాకుండా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా ప్రాతినిధ్యం ఉన్న పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పార్టీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ఆలోచనతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉంది. ఈ క్రమంలోనే పార్టీలోని ముఖ్య నేతలను జిల్లా స్థాయి ఇన్ఛార్జ్లుగా నియమించి… బూత్ స్థాయి సమీకరణపై దృష్టి సారించి ప్రచారం చేయడానికి ప్రణాళికలను సిద్దం చేసుకుంటుంది.





Leave a Reply