ధనిక్ భారత్ పేరుతో కళాశాలలు
వెల్లడించిన అధినేత విక్రమ్ నారాయణరావ్
కళాశాలల డైరెక్టర్ గా బాలలత
(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ విద్య కోసం మరో ప్రముఖ ఫార్మ కంపెనీ ( లాయిడ్) వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఏడాది 16 క్యాంపస్ లతో కళాశాలలను ప్రారంభించనుంది. కార్పోరేట్ కళాశాలలకు భిన్నంగా భవిష్యత్ తీర్చి దిద్దడమే లక్ష్యంగా తాము కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు యాజమన్యం వెల్లడించింది. హైదరాబాద్ లోని బాలలత ఐ ఎఎస్ అకాడమీలో ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ చైర్మన్ సహా బోర్డు సభ్యులు వెల్లడించారు.లాయిడ్ ఫార్మా కంపెనీ సీఎండీ గా ఉన్న విక్రమ్ నారాయణ రావ్ ఈ కళాశాలలకు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో దేశాన్ని అన్నిరంగాల్లో 2047 నాటికి అభివృద్ధి చెందాలన్న లక్ష్యంగా నిర్దేశించుకుందని, తమ సంస్థ కూడా అదే స్సూర్తితో ధనిక్ భారత్ పేరుతో విద్యా రంగంలోకి అడుగు పెడుతున్నట్లు విక్రమ్ వెల్లడించారు. తాము విద్యా బోధనను వ్యాపర పరంగా చూడమని సేవా దృక్ఫదంతోనే చూడాలన్న లక్ష్యంగా తాము విద్యారంగాన్ని ఎంచుకున్నట్లు వివరించారు.

కార్పోరేట్ కళాశాలలకు తమ కళాశాలల్లో విద్యా బోధనకు ఎంతో తేడా ఉంటుందన్నారు. నిర్భంధ విద్యా విధానాన్ని కొన్ని కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాయని తాము స్మార్ట్ లర్నింగ్ విధానంతో విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. తమ విద్యాసంస్థలను దశల వారిగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలిపారు. సుదీర్ఘ అనుభవం ఉన్న బోధనా సిబ్బందని తాము నియమించుకున్నామని, సంస్థలో డైరెక్టర్లుగా ఉన్న వారు తమ విద్యా సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులను కేవలం విద్యా పరంగానే కాకుండా సాంకేతికంగా నిపుణులుగా తీర్చిదిద్దడం, వారిలో విలువలను పెంపొందించడం వంటివి కూడా తమ బోధనలో కీలకం అన్నారు.

విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా విషాల ప్రయోజనాలతో వారిని జీవితంలో స్థిరపడేలా తమ విద్యా బోధన సాగుతుందని విక్రమ్ చెప్పారు. పేద విద్యార్థులను ప్రోత్సహించే విధంగా తమ విధానాలను ఉంటాయని, వ్యాపర దృక్ఫదంతో తాము కళాశాలలను ప్రారంభించడం లేదని స్పష్టం చేశారు. కళాశాలలో డైరెక్టర్లుగా ఉన్న వారంతా తమ అనుభవాన్ని, ప్రాధాన్యతలను వివరించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వచ్చే విద్యా సంవత్సరం నాటికి 8 కళాశాలలను ప్రారంభిస్తూ…. గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా తమ కళాశాలలను మొదలు పెట్టనున్నట్లు విక్రమ్ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో తెలుగురాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థగా ధనిక్ భారత్ ను సిద్ధం చేస్తామని పాఠశాలల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా విధానాన్ని అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని చెప్పారు.
నాణ్యమైన విద్యా, విలువలు తమ లక్ష్యం…..
విద్యార్థులు ఒక్కసారి ధనిక్ భారత్ విద్యా సంస్థలో చేరితో వారు జీవితంలో స్థిర పడే వరకు తాము అండగా ఉంటామని, విద్యార్థి స్థాయి నుంచి అన్ని దశల్లో అవసరమైన గైడెన్స్ ఇస్తామని బాలలత చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్న బాలలత ఈ సంస్థలో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

దీంతో ఇంటర్ విద్యార్థుల్లో ఉండే టెన్షన్ ను తొలగిస్తూ వారిని స్మార్ట్ లర్నింగ్ ద్వారా విద్యాభ్యాసం చేస్తామని బాలలత అన్నారు. తాము మొదలు పెట్టే ఈ కళాశాలల్లో ఒక్కో సెక్షన్ లో 30 నుంచి 40 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటామన్నారు. దశల వారిగా అంచనా వేస్తూ ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధించే విధంగా సిద్ధం చేయడం తమ లక్ష్యమని వివంరించారు. నేటి విద్యా విధానంలో నీట్, ఐఐఐటి, జెఇఇ లతో పాటు అనేక మార్గాలున్నాయని చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో విద్యావ్వవస్థలో భారీగా మార్పులు వస్తాయని అందుకు అనుగుణంగా తాము విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు.







Leave a Reply