పోలీసుల నోటీసులు
స్పందించిన కేటిఆర్
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. రెండు రోజుల క్రితం బీఆర్ ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్ రావ్ కు నోటీసు ఇచ్చిన సిట్ తాజాగా కేటిఆర్ కు నోటీసులు విచారణలో వేగం పెంచింది. హరీష్ రావ్ ను దాదాపు 7.30 గంటల పాటు పోలీసులు విచారించారు. శుక్రవారం హరీష్ రావ్ వెల్లడించిన అంశాలపై కేటిఆర్ ను అధికారులు విచారించే అవకాశం ఉంది. అయితే హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని పోలీసులు లీక్ చేయడంతో….ఈ వ్యవహారం సస్పెన్స్ గా మారుతోంది. సిట్ నోటీసులు ఇచ్చిన సమయంలో సిరిసిల్లలో ఉన్న కేటిఆర్ స్పందించారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. ప్రభుత్వం వేసిన సిట్ అది విచారణ సంస్థలా వ్యవహరించడం లేదని రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్….స్టాండ్ అంటే స్టాండ్ అన్న చందంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది ఒక డైయిలీ సీరియల్ ను తలపిస్తోందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ సీఎం రేవంత్ ఆడుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా. అట్లనే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా. కొన్ని రోజులు ఫార్ములా-ఇ అని కొన్ని రోజులు డ్రామా. ఈ రెండేళ్లు ఈ డ్రామాలు తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ఇచ్చింది ఏమి లేదన్నారు.

మొన్న హరీష్ రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెడితే బయటపెడితే… సాయంత్రం కల్లా సిట్ నోటీసు ఇచ్చారు. పొంగులేటీ కొడుడు దౌర్జన్యాలు, రేవంత్ రెడ్డి బావమరిది అక్రమాలపై సిట్ ఎందుకు వేయరని కేటిఆర్ ప్రశ్నించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ‘ఆర్ఆర్ టాక్స్’ (RR Tax) అమలవుతుందని వ్యాఖ్యలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాప్ చేస్తుందని మంత్రులు చెబితే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు.మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదని డీజీపీ, ఇంటెలీజెన్స్ అధికారులు ప్రమాణం చేసి చెప్పగలరా అని కేటిఆర్ ప్రశ్నించారు. పోలీసులు రొటీన్ గా శాంతిభద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం.
విచారణ కాదు….చర్యలు తీసుకోండిఃకిషన్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సీరియల్ గా సాగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. యాక్షన్ తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును టైం పాస్ చేస్తోందన్నారు.






Leave a Reply