NewsInn

News in a Click

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

చర్లపల్లి-తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలు

లాంగ్-జర్నీ ప్రయాణికులకోసం ప్రత్యేక వసతులు

ప్రారంభించనున్న ప్రధానమంత్రి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులకు సేవలందించనుంది. 23 జనవరి 2026న దేశవ్యాప్తంగా నాలుగు అమృత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరువనంతపురం నుంచి ఈ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరువనంతపురం నుంచి చర్లపల్లి వరకు ఈ అమృత భారత్ రైలు నడవనుంది. ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్ పూర్ (బిహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలందిస్తుండగా ఇది తెలంగాణ రాష్ట్రానికి రెండోది. ఎక్కువదూరం ప్రయాణించే రైలు రూట్లలో.. ప్రయాణికులకు మరింత సులభతరమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించే దిశగా ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత….

ఈ రైలు ప్రతి మంగళవారం 17041 నెంబరుతో ఈ నడిచే రైలు ఉదయం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడినుంచి 17042 నెంబరుతో బుధవారం సాయంత్రం 5.30కు బయలుదేరి.. గురువారం రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.

నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట.. తమిళనాడులోని తిరుత్తణి, కటపాడి,జోలార్ పెట్టయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్.. కేరళలోని పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగన్‌సెర్రీ, తిరువల్ల, చెంగనూర్, మావెలికర, కాయంకుళం, కరునాగపల్లి, కొల్లాం, వర్కాల శివగిరి మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది.

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆధునిక పద్ధతుల్లో….

ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా.. ఈ స్వదేశీ సాంకేతికతతో ఈ ట్రైన్ డిజైన్ చేశారు. సుదూరమైన రూట్లలో ప్రయాణించే వారికి నాన్-ఏసీ ప్రయాణాన్ని సౌకర్యవంతమైన వసతులను అందించనున్నారు. ఈ రైలులో ప్రయాణికుల సౌక‌ర్యం కోసం ఫోల్డబుల్ స్నాక్స్ టేబుల్స్, మొబైల్ మరియు బాటిల్ హోల్డర్స్, రాత్రివేళల్లో బోగీలో దారి సరిగ్గా కనిపించేలా రేడియం ఫ్లోర్ స్ట్రిప్స్, సౌకర్యవంతమైన సీటింగ్/స్లీపింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రో-న్యుమాటిక్ ఫ్లషింగ్ తో కూడిన మాడ్రన్ టాయిలెట్స్, మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చే వ్యవస్థ, దివ్యాంగులకోసం ప్రత్యేక ఏర్పాట్లు, స్పీడ్ చార్జింగ్ పాయింట్స్, పాంట్రీ కార్ వంటి వసతులు క‌ల్పించారు.

ఈ రైలుతో పాటు మరో మూడు రైళ్లను శుక్రవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.

  1. నాగర్‌కోయిల్ నుంచి మంగళూరుకు,
  2. తిరువనంతపురం నుంచి తాంబరం
  3. త్రిస్సూర్ నుంచి గురువాయూర్ వరకు నడవనున్నాయి.

షెడ్యూల్…..

  1. తిరువనంతపురం నార్త్ 10.45 (D) శుక్రవారం
  2. వర్కాల 11.05 / 11.07
  3. కొల్లాం 11.28 / 11.30
  4. కాయంకుళం 12.03 / 12.05
  5. మావెలికర 12.15 / 12.17
  6. చెంగనూర్ 12.28 / 12.30
  7. తిరువల్ల 12.40 / 12.42
  8. చెంగన్‌సెరి 12.55 / 12.57
  9. కొట్టాయం 13.12 / 13.15
  10. ఎర్నాకులం టౌన్ 14.15 / 14.18
  11. అలువ 14.38 / 14.40
  12. త్రిసూర్ 15.20 / 15.23
  13. షోరనూర్ ‘బి’ క్యాబిన్ 16.35 (T)
  14. పాలక్కడ్ జంక్షన్ 17.10 / 17.20
  15. పొదనూన్ 18.30 (T)
  16. కోయంబత్తూర్ జంక్షన్ 18.40 / 18.45
  17. తిరుప్పూర్ 19.18 / 19.20
  18. ఈరోడ్ జంక్షన్ 20.25 / 20.35
  19. సేలం జంక్షన్ 21.27 / 21.30
  20. జోలార్ పెట్టయ్ జంక్షన్ 23.55 / 00.02
  21. కటపాడి జంక్షన్ 01.10 / 01.15
  22. తిరుత్తణి 02.15 / 02.20
  23. రేణిగుంట జంక్షన్ 03.20 / 03.30
  24. గూడూరు 05.15 /05.20
  25. నెల్లూరు 05.43 / 05.45
  26. ఒంగోలు 07.30 / 07.32
  27. బాపట్ల 08.30 / 08.32
  28. తెనాలి జంక్షన్ 09.38 / 09.40
  29. గుంటూరు 10.20 / 10.30
  30. సత్తెనపల్లి 11.23 / 11.25
  31. మిర్యాలగూడ 12.48 / 12.50
  32. నల్లగొండ 13.23 / 13.25
  33. పడిగిపల్లి 15.20
  34. చర్లపల్లి 16.30 (శనివారం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *