(హైదరాబాద్,న్యూస్ఇన్)
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమావేశాల్లో తెలంగాణ ఏ ఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)కు అంతర్జాతీయ స్థాయిలో అపూర్వ స్పందన లభించింది. ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం పలు ప్రతిష్ఠాత్మక సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.బ్రిటన్కు చెందిన ప్రముఖ విద్యా, పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏ ఐ అకాడమీకి పియర్సన్ సహకారం అందించనుంది. ఏ ఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ . రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… యువతకు ఏ ఐ శిక్షణ అందించి భవిష్యత్ తరాలకు నైపుణ్యం కలిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఎంఓయూ కుదుర్చుకున్న బృందాన్ని ఆయన అభినందించారు.ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఏ ఐ సిటీ నిర్మాణానికి అవసరమైన పూర్తి స్థాయి ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే అన్ని ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయని, ప్రతిభ, మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఐటీ, పరిశ్రమలు) సంజయ్ కుమార్ మాట్లాడుతూ, పియర్సన్తో కలిసి ఉన్నత నైపుణ్యాల కలిగిన మానవ వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రాజెక్టు త్వరితగతిన అమలుకు అవసరమైన అనుమతులు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.






Leave a Reply