(హైదరాబాద్,న్యూస్ఇన్)

కేటిఆర్ సిట్ విచారణకు వెళుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావ్ సీరియస్ అయ్యారు. పదవీ విరమణకు దగ్గరున్న పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు అత్యుత్సాహం చూపిన రోజులు గుర్తుంచుకోవాలని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారిని ఎక్కడున్నా పట్టుకొచ్చి విచారిస్తామన్నారు. సొంత డబ్బులతో విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసులకు ఇబ్బందులు తప్పవన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరు కావడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణా భవన్లో పార్టీ కార్యకర్తలను నిరోధించేందుకు పోలీసులు ప్రయత్నిచండంతో కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిట్ విచారణను ఎదుర్కొనేందుకు కేటిఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో నేతలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్లే యత్నం చేశారు. నేతలను పోలీస్ స్టేషన్ సమీపంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో పోలీసులకు, బీఆర్ ఎస్ నేతలకు వాగ్వాదం జరిగింది.


Leave a Reply