NewsInn

News in a Click

మేడారంకు 28 నుంచి ప్ర‌త్యేక రైళ్లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

మ‌రో నాలుగు రోజుల్లో మొద‌ల‌య్యే మేడారం జాత‌ర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. నాలుగు రోజుల పాటు ప్ర‌త్యేక రైళ్ల న‌డిపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.హైద‌రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కాజీపేట‌, వరంగ‌ల్, ఖ‌మ్మం జిల్లాల నుంచి ప్ర‌త్యేక రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే న‌డిపించ‌నుంది. జ‌న‌సాధార‌ణ రైల్ల పేరుతో మొత్తం 28 రైళ్ల‌ను నాలుగు రోజుల పాటు నిర్వ‌హించాల‌ని ద రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది.

🔹 సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కాజీపేట, వరంగల్ & ఖమ్మం నుండి ప్రత్యేక రైళ్లు
🔹 సేవలు 28 జనవరి మరియు 1 ఫిబ్రవరి 2026 మధ్య నిర్వహించబడతాయి
🔹 కాజీపేట, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల్, రామగుండం, ఖమ్మం మరియు మరిన్నింటి మీదుగా కీలక యాత్రికుల మార్గాలకు కనెక్టివిటీ
🔹 అన్ని రైళ్లు భక్తులకు సులువుగా చేరుకోవడానికి సెకండ్ జనరల్ (అన్ రిజర్వుడ్) కోచ్‌లను కలిగి ఉంటాయి

ఈ ప్రధాన రైలు చొరవ మేడారం సందర్శించే లక్షలాది మంది యాత్రికులకు సురక్షితమైన, సరసమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయ‌ని రైల్వే అధికారులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *