శనివారం నుంచే అమలు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తున్న యజమానాలకు రవానా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలు అమ్మే డీలర్ల వద్దనే రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. శనివారం నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమలులోకి రానుంది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్ రవాణా శాఖాధికారులు చేసిన పరీక్షలు విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం ద్వారానే వ్యక్తిగత వాహనాలను రిజిస్ట్రేషన్ చేయనుంది. ప్రయోగత్మకంగా శుక్రవారం రోజుELEVATE ZX MT 4 వీలర్ వాహనాన్ని వాహనదారుడికి ఈ విధానం రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత పత్రాలను అందజేశారు.

కొత్త విధానం….ఇలా పనిచేస్తుంది…..
• వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలర్నే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు.
• అవసరమైన పత్రాలు (ఇన్వాయిస్, ఫారం–21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫోటోలు మొదలైనవి) డీలర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయబడతాయి.
• రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు.
• రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపబడుతుంది.
ఈ విధానం అమలుతో ప్రజలకు,
• సమయం ఆదా అవుతుంది,
• RTO కార్యాలయాలకు వెళ్లే అసౌకర్యం తగ్గుతుంది,
• వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది.
అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై తనిఖీలు నిర్వహిస్తారు. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.ఈ సౌకర్యం ద్విచక్ర వాహనాలు మరియు కార్లకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన, డిజిటల్ మరియు సమర్థవంతమైన రవాణా సేవలను అందించనుంది
ఈ విధానం అమలు పై రవాణా శాఖ కమిషనర్ 33 జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఆ విధానం అమలు లో షో రూమ్ డీలర్లకు ఏవైనా సందేహాలుంటే సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది.24-01-2026 నుండి కొన్న వాహనాలకు మాత్రమే ఈ విధానం వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు.






Leave a Reply