NewsInn

News in a Click

కామ‌న్ సింబ‌ల్ తో క‌విత పార్టీ పోటీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కామ‌న్ సింబ‌ల్ తో పోటీ చేసేందుకు తెలంగాణా జాగృతి అధ్య‌క్షురాలు క‌విత నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన సింహం గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.తెలంగాణా ఉద్య‌మంతో పాటు జాగృతి వేదికపై పనిచేస్తున్న క్యాడర్‌కు అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల బరిలో స్థానికంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని క‌విత భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో పోటీ చేస్తుందా…కొన్ని చోట్ల మాత్ర‌మే పోటీ చేసేందుకు క‌విత ఆస‌క్తిగా ఉన్నారా అన్న దానిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. కామ‌న్ సింబ‌ర్ కోసం ఆల్ ఇండియా ఫార్వ‌ర్డ్ బ్లాక్ తో జ‌రిపిన చ‌ర్చ‌లు విజ‌యవంతం కావ‌డంతో కొన్ని ప్రాంతాల్లో నైనా త‌మ అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దించాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *