NewsInn

News in a Click

అండమాన్ పేరు ఆజాద్ హింద్ గా మార్చాలి

అండమాన్ పేరు ఆజాద్ హింద్ గా మార్చాలి

ప్రధాని మోడీకి లేఖ రాసిన కవిత

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను గౌరవిస్తూ అండమాన్ దీవుల పేర్ల‌ను ఆజాద్ హింద్ గా మార్చాల‌ని మాజీ ఎంపీ దేవ‌న‌పల్లి క‌విత డిమాండ్ చేశారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు జోజిరెడ్డి, ఆర్వీఆర్ ప్రసాద్, తేజ్ దీప్ రెడ్డిలు కోరారు. అండ‌మాన్ పేరు పేరు మార్పును కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి క‌విత లేఖ రాశారు. ఈ నెల 26 న ట్విట్టర్ లో హాష్ ట్యాగ్ మూమెంట్ ను నడిపిస్తామని కవిత వెల్లడించారు. జాగృతి నెట్ వ‌ర్క్ తో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్ వచ్చేలా చేస్తామని చెప్పారు. నిజానికి అండమాన్ నికోబార్ పేరును బ్రిటీష్ వాళ్లు పెట్టారని తెలిపారు. వారి పేర్లను కొనసాగించకుండా మన వీరుడి పేరు ఆ ఐలాండ్ కు పెట్టాలన్నారు. బీజేపీ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గౌరవార్థం జనవరి 26 న అండమాన్ పేరు మార్చుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.


సైన్యంలో మహిళలకు ప్రాధాన్యం….
లక్ష్య శుద్ధి, చిత్త శుద్ధి ఉన్న నాయకులంతా కూడా నేతాజీని స్ఫూర్తిగా తీసుకోవాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మహిళలు రోడ్లు ఎక్కితే గానీ మాకు ఇచ్చే 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదని, కానీ ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి పేరుతో మహిళలకు సైన్యంలో నేతాజీ అవకాశం ఇచ్చారన్నారు. మహిళలకు గన్ ఇచ్చి పోరాటం చేయాలని ఆయన ధైర్యం చెప్పారని కవిత తెలిపారు. నేతాజీ మన దేశం గర్వించదగ్గ మన సంపద అని, ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *