(హైదరాబాద్, న్యూస్ఇన్)
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వివాహం ఆదర్శంగా నిలిచింది.చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి హంగు, ఆడంబరం లేకుండా అధికారులు రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెంకి చెందిన యువ ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డిని, కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తుండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు.సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలిచే విధంగా వీరి వివాహానికి పలువురు ఉన్నతాధికారులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.





Leave a Reply