NewsInn

News in a Click

హైద‌రాబాద్ లో ఎంజీఎన్‌రేగా బచావో సంగ్రామ్ యాత్ర

ప్రారంభించిన కాంగ్రెస్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

కేంద్ర ప్ర‌భుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోంద‌ని ఆరోపిస్తూ అఖిల భార‌త కాంగ్రెస్ పార్టీ పిలుపు మేర‌కు చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్రమాన్ని హైద‌రాబాద్ కాంగ్రెస్ ప్రారంభించింది. ఈ యాత్ర చార్మినార్ నుంచి పురానాపుల్ వరకు సాగగా, అదే రోజున యాకుత్‌పురాలోని సింగరేణి కాలనీ నుంచి సంతోష్‌నగర్ ఎక్స్‌రోడ్స్ వ‌ర‌కు కాంగ్రెస్ నేత‌లు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త నిర‌స‌న పిలుపులో భాగంగా హైద‌రాబాద్ డీసీసీ అధ్య‌క్షులు సైఫుల్లా ఈ యాత్ర‌ను చేప‌ట్టారు. ఈ పాద‌యాత్ర‌కు హాజ‌రైన హ‌న్మంత‌రావ్ మాట్లాడుతూ, “మోదీ ప్రభుత్వం ఎంజీఎన్‌రేగా ఆత్మను నాశనం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉపాధిని డిమాండ్ చేసే చట్టబద్ధ హక్కును కేంద్రం నియంత్రించే ఉపకారంగా మార్చుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో అంగీకరించలేమ‌ని అన్నారు.ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కొత్త విధానంలో వేతన భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారుహైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా మాట్లాడుతూ.గ్రామ పంచాయతీల అధికారాలు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని విమ‌ర్శించారు. 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం అమలును నిరుత్సాహపరుస్తుంది. ఇది పేదలపై, ముఖ్యంగా ఎంజీఎన్‌రేగా మీద ఆధారపడే మహిళలు పేద‌ కుటుంబాలపై నేరుగా చేసిన దాడి అని అన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఈ పథకం ద్వారా 180 కోట్లకు పైగా మానవ-రోజుల ఉపాధి, దాదాపు 10 కోట్ల ప్రజా ఆస్తులు సృష్టించబడ్డాయని, స్థానిక ప్రణాళికల ద్వారా గ్రామ పంచాయతీలను బ‌లోపేతం చేసిందన్నారు. హైద‌రాబాద్ జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ పాద‌యాత్ర సాగుతూ జ‌న‌వ‌రి 26వ తేదీన ముగియ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *