2025 అవార్డు గ్రహీతల ప్రకటన
(హైదరాబాద్,న్యూస్ఇన్)

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2024 సంవత్సరంలో తొలిసారిగా “గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్”ను ప్రారంభించారు. మొదటి సంవత్సరంలో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు & ఆటలు మరియు సంస్కృతి రంగాలను ఎంపిక చేసి అందు విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలకు 26.01.2025న అవార్డులు ప్రదానం చేసారు.2025 సంవత్సరానికి గాను మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ & మెడిరల్ ఫిలాంత్రపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ అనే నాలుగు రంగాలలో విశేష స్వచ్ఛంద సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి వారికి “గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్” ప్రదానం చేయాలని నిర్ణయించారు.అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు.
• వ్యక్తులు (INDIVIDUALS)
- మహిళా సాధికారత – శ్రీమతి రమాదేవి కన్నెగంటి, హైదరాబాద్.
- గిరిజన అభివృద్ధి – శ్రీ తోడసం కైలాస్, వాఘాపూర్, ఆదిలాబాద్ జిల్లా.
- రూరల్ హెల్త్ & మెడిరల్ ఫిలాంత్రపీ – డా. ప్రద్యుత్ వాఘ్రే, హైదరాబాద్.
- కార్పొరేట్ వాలంటీరింగ్ – శ్రీ వి. రాజన్న, హైదరాబాద్.
• సంస్థలు (ORGANIZATIONS):
- మహిళా సాధికారత – శ్రీ సాయి సోషల్ ఎంపవర్మెంట్ సొసైటీ, ఘట్కేసర్.
- గిరిజన అభివృద్ధి – Indigenous Development Organisation (IDO), గట్టుమల్ల (వి), భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా.
- రూరల్ హెల్త్ & మెడిరల్ ఫిలాంత్రపీ – రామదేవ్రావు హాస్పిటల్, హైదరాబాద్.
- కార్పొరేట్ వాలంటీరింగ్ – Give for Society, ఘట్కేసర్
ప్రతి అవార్డుకు రూ.2,00,000/- నగదు బహుమతి మరియు అవార్డు గ్రహీతల విశిష్ట సేవలను గుర్తించే ప్రశంసా పత్రం ఇవ్వబడును. ఈ అవార్డులను 26 జనవరి 2026న లోక్ భవన్, హైదరాబాద్లో సాయంత్రం 5:00 గంటలకు నిర్వహించనున్న ‘AT HOME’ కార్యక్రమంలో ప్రదానం చేస్తారు.






Leave a Reply