NewsInn

News in a Click

జాబ్ క్యాలండ‌ర్ …స్కాం క్యాలండ‌ర్ అయింది

అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌పెడుతూం

మాజీ మంత్రి హ‌రీష్ రావ్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్ర‌కారం జాబ్ క్యాలండ‌ర్ రాలేద‌ని, స్కాం క్యాలండ‌ర్ మాత్రం వ‌చ్చిందిన మాజీ మంత్రి హరీష్ రావ్ ఆరోపించారు. సింగ‌రేణి బొగ్గు గ‌నుల విష‌యంలో రాజుకున్న వివాదంలో మూడు ప్ర‌ధాన పార్టీలు త‌మ వాద‌న‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే య‌త్నం చేస్తున్నాయి. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌లు దొంగే దొంగ దొంగ అన్న‌ట్లు ఉంద‌న్నారు. నేను లేఖ రాస్తే…సీఎంను ఒప్పించి విచార‌ణ చేయిస్తాన‌న‌డం దొంగ చేతికి తాళం ఇచ్చిన‌ట్లే అవుతుంద‌న్నారు.సీఎం బావ‌మ‌రిది పాత్ర ధారిగా ఉన్న ఉన్న స్కాంలో రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపితే ఏం తేలుతుంద‌న్నారు. భ‌ట్టి అస‌లు విష‌యాన్ని దాచి ఉత్త కాగితాలు చూపించా మీడియా స‌మావేశాన్ని పూర్తి చేశారని ఆరోపించారు.

సైట్ విజిట్ స‌ర్టిఫికెట్ భ‌ట్టి అబ‌ద్దాలు చెప్పార‌న్నారు. సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదన్నారు.ముఖ్యమంత్రి, ఆయన బావమరిది బాగోతం బయటపడకుండా తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. సైనిక్ స్కూల్ వాళ్ళు సప్లై అండ్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ క్లాత్ డ్రైయర్ కోసం సైట్ విజిట్ అని నిబంధ‌న పెట్టార‌ని, దాన్ని సింగరేణి ఓబీ కాంట్రాక్టుకు లింకు పెట్టి చూపడం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఈ కుంభకోణంలో కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టాడు? ముఖ్యమంత్రి బంధువు కూడా ఆ హోటల్లో కూర్చున్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అవి టైం వచ్చినప్పుడు బయట పెడతామ‌ని వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉత్పత్తి పడిపోయింది. బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయి. సింగరేణిలో జరిగిన స్కాంలు మొత్తం సంస్థనే ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇవి నేను చెప్పడం లేదు.. సింగరేణి గణాంకాలే చెబుతున్నాయని హ‌రీష్ రావ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయని హ‌రీష్ రావ్ ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే, ఈ మొత్తం కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *