NewsInn

News in a Click

బీఆర్ఎస్ ను ప్ర‌జ‌లు బ్యాన్ చేసే ప‌రిస్థితి ఉంది

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా పార్టీదే అధికారం

హ‌రీష్ రావ్ ట్రాప్ లో కేటిఆర్

బీఆర్ ఎస్ పై విరుచుకు ప‌డ్డ దేవ‌న‌ప‌ల్లి క‌విత‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

తెలంగాణాలో ఓ మీడియా సంస్థ‌ను బీఆర్ ఎస్ పార్టీ బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణ‌యంపై మాజీ ఎంపీ దేవ‌న‌ప‌ల్లి క‌విత తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీడియా సంస్థ‌ను పార్టీ బ్యాన్ చేస్తే…తెలంగాణా ప్ర‌జ‌లుఆ పార్టీని బ్యాన్ చేసే ప‌రిస్థితులు వ‌స్తాయ‌నిహెచ్చ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీని ప్ర‌జ‌లు గెలిపిస్తార‌న్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లూజింగ్ పార్టీని క‌విత చెప్పారు. పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ మా పార్టీలో చేరితే ఆయ‌న అనుభ‌వానికి త‌గిన ప‌ద‌వి ఇస్తామ‌ని క‌విత ఎద్దేవా చేశారు.

సింగ‌రేణి బొగ్గు గ‌నుల వ్య‌వ‌హారంలో కూడా బీఆర్ ఎస్ అనుస‌రిస్తున్న విధానాన్ని క‌విత త‌ప్పు బ‌ట్టారు. సీఎం బావ‌మ‌రిది సృజ‌న్ రెడ్డికి కేవ‌లం 250 కోట్ల రుపాయాల కాంట్రాక్ట్ మాత్ర‌మే ఉంద‌ని సీఎం సాకుగా చూపి బీఆర్ఎస్ సింగ‌రేణి స్కాం ను ఫోక‌స్ చేస్తున్నార‌న్నారు. బీఆర్ ఎస్ హాయంలో కూడా సృజ‌న్ రెడ్డి కాంట్రాక్ట‌లు చేసినట్లు క‌విత పేర్కొన్నారు. ఈ స్కాంలో కీల‌క సంస్థ 25 వేల కోట్ల కాంట్రాక్టును ద‌క్కించుకోవాల‌ని చూసింద‌ని, దీన్ని హ‌రీష్ రావ్ ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేదన్నారు. కాంగ్రెస్ నేత‌ల వాటాలు ఇక్క డ సెటిల్ అయినా….హ‌రీష్ రావ్ వాటా సెటిల్ కాక‌పోవ‌డంతో దీన్ని కొండ‌త చేస్తున్నార‌ని క‌విత ఆరోపించారు. హ‌రీష్ రావ్ ద‌ళిత కమ్యూనిటీని అవ‌మాన‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హ‌రించార‌ని క‌విత విమ‌ర్శించారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి లేఖ రాస్తే భ‌ట్టి ద‌ళిత నేత కావ‌డంతోనే లేఖ రాసేందుకు హ‌రీష్ ఆస‌క్తి చూప‌డం లేద‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కోర‌కుండా సీబీఐ ఈ కేసులో ముందుకు వ‌స్తాందా అని ఆమె ప్ర‌శ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విచార‌ణ అంతా డ్రామా అని మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ఇది న‌డిపిస్తుంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *