NewsInn

News in a Click

న‌ల్ల‌మ‌ల్ల సాగ‌ర్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

న‌ల్ల‌మ‌ల్ల సాగ‌ర్ పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

తెలంగాణా అభ్యంత‌రాన్ని త‌ప్ప‌ని చెప్పండి

బడ్జెట్ సెషన్‌లోనే అమరావతి రాజధానిగా రాజముద్ర‌

టీడీపీపీ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు నిర్దేశం

(అమరావతి,న్యూస్ఇన్‌)

రాష్ట్రాభివృద్ధిలో ఎంపీల భాగస్వామ్యం కీలకంగా ఉండాలని, మన రాష్ట్రానికి ఇంకేం సాధించవచ్చనే దానిపై ఆలోచించి నిధులను రాబట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలకు సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి అవకాశాలు, సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలన్నారు.ఈ స‌మావేశాల్లోనే అమరావతి రాజ‌ధానిగా చట్టబద్దత కల్పిస్తూ ఈ సెషన్లోనే బిల్లు పెట్టనున్నారని… దీనిపై కేంద్రంలోని సంబంధిత మంత్రి, అధికారులతో టచ్ లో ఉండాలని సీఎం సూచించారు ఈ ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కు సంప్ర‌దింపులు జ‌రుపాల‌ని చంద్ర‌బాబు ఎంపీల‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన టీడీపీపీ సమావేశం జరిగింది. జనవరి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలు… కేంద్రంతో జరపాల్సిన సంప్రదింపులు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు..వెనకబడిన ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజ్, పూర్వోదయ పథకం, పోలవరం-నల్లమల సాగర్… ఈ మూడింటిని ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలన్నారు. . వీటితో పాటు.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందనే అంశాలను పార్లమెంటులో వివిధ సందర్భాల్లో ప్రస్తావించాలని సూచించారు.

వివాదాలు వద్దు… నీళ్లు కావాలి…

కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడుతున్న క్రమంలో ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా చూడాలని ఎంపీలకు సీఎం సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు… ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని… దీనికి సంబంధించి రూ.12,000 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాలని చెప్పారు. 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల లోపు పోలవరం నిర్మాణం పూర్తి చేయగలిగితే బావుంటుంది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలు అవసరం లేదని ముఖ్యమంత్రి అన్నారు. నల్లమల సాగర్ వంటి అంశాలు పార్లమెంటులో ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా ప్రస్తావనకు వస్తే ఏపీ వాదనలు గట్టిగా వినిపించాలని సూచించారు. ఇదే సందర్భంలో నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తెలంగాణ అభ్యంతరం చెప్పడం కరెక్ట్ కాదనే అంశాన్ని వివరించాలని సీఎం ఎంపీలకు స్పష్టం చేశారు. విభజన సమస్యలు, జాతీయ రహదారుల విస్తరణ, సాగరమాల ప్రాజెక్టుల్లో చేపడుతున్న పనుల పురోగతిని తెలుసుకోవాలన్నారు. కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు రాబట్టవచ్చో చూడాలన్నారు. రాష్ట్రస్థాయి అంశాలే కాకుండా… జాతీయ స్థాయిలో ఎన్డీఏ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు… ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు చేస్తున్న సమయంలో ధీటుగా సమాధానం చెప్పేందుకు చొరవ చూపాలని సీఎం ఎంపీలకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *