NewsInn

News in a Click

గురుద్వారాలో ఫ‌డ్న‌వీస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు

గురుద్వారాలో ఫ‌డ్న‌వీస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు

నాంధేడ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్ధనలు

పవన్ కళ్యాణ్ ను సత్కరించిన గురుద్వారా ఛైర్మన్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌)

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో క‌లిసి ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు
నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన ప‌వ‌న్ కళ్యాణ్ మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్తో కలసి పవన్ కళ్యాణ్ గారు గురుద్వారాలో ప్రవేశించారు. ప్రధాన మందిరంలో శ్రీ గురుగోవింద్ సింగ్ సాయిబాకు ప్రార్ధనలు చేశారు. చాదర్ ను సమర్పించి నమస్కరించారు. అనంతరం గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని సీఎం, డిప్యూటీ సీఎంల‌ను ఆశీర్వ‌దించారు. గురుద్వారా ఎదుట అత్యంత పవిత్ర స్థలంగా సిక్కు సోదరులు పూజించే నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. దర్శనం అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్ ను ప‌వ‌న్ కళ్యాణ్ ప్రారంభించారు. మొదటిసారి సచ్ కండ్ గురుద్వారాకి విచ్చేసిన పవన్ కళ్యాణ్ ను సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్ ను బహూకరించారు.గురుద్వారా సందర్శన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ దేశం మొత్తానికి స్ఫూర్తిని నింపారు. ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని నింపుతుంది. అలాంటి గురువు షాహిదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *