బంగారం బుకింగ్ కు ఆన్ లైన్ లో ఏర్పాట్లు
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన”సమ్మక్క సారలమ్మ జాతర’’ ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్లకు బంగారం సమర్పించాలనకునే భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవల్ని ఏర్పాటు చేసింది. ములుగు (వరంగల్) జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ దేవతలను పూజించడానికి తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి అమ్మవార్లను దర్శించుకుని బంగారం సమర్పించుకోవడం ఆనవాయితీ. అయితే, వివిధ కారణాల వల్ల మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ తగు ప్రణాళికలు సిద్దం చేసింది.దేవాదాయ శాఖ సహకారంతో, మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో సహా బెల్లం, పసుపు కుంకుమ వస్తువులు అందజేయడం జరుగుతుంది.

బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు కేవలం రూ.299/- చెల్లించాల్సి ఉంటుంది.భక్తులు www.tgsrtclogistics.co.in వెబ్సైట్లో లాగిన్ ద్వారా లేదా సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు.మరింత సమాచారం కోసం, టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ను 040-69440069, 040-23450033 నంబర్లలో సంప్రదించవచ్చు.
మేడారం భక్తులకు స్పెషల్ బస్సులు…….
మేడారం భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచ 400 ఆర్టీసి బస్సులను మేడారం జాతర స్పెషల్ బస్సులను నడిపిస్తున్నాట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు సమ్మక్క సారాలమ్మ గద్దెల వరకు వెళుతాయని ప్రకటన విడుదల చేశారు.





Leave a Reply