(స్పోర్ట్స్ డెస్క, న్యూస్ఇన్)
న్యూజీలాండ్ తో జరుగుతున్న టీ-20 సీరిస్ లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడు మ్యాచ్ లో రెండు మ్యాచ్ లో అభిషేక్ విధ్వంసానికి న్యూజీలాండ్ బౌలర్లతో సమాధానం లేకుండా పోయింది. గౌహటీలో జరిగిన మ్యాచ్ లో యువ బ్యాట్స్ మెన్ మరింత రెచ్చిపోయారు.
కేవలం 14 బంతుల్లోనే 50 పరుగులు చేసి 20 బంతుల్లో 68 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. సరిగ్గా పది ఓవర్లోనే న్యూజీలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ చేస్ విజయం దక్కించుకుంది. దీంతో మ్యాచ్ ముగిసి పెవిలియన్ కు వస్తున్న సమయంలో కీవీస్ ప్లేయర్లు అభిషేక్ శర్మ బ్యాట్ ను తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. కీవీస్ ఆటగాళ్లకు బ్యాచ్ ఇచ్చిన అభిషేక్ వారితో నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ మారింది. అభిషేక్ బ్యాట్ లో స్పీంగ్ లు ఏమైనా ఉన్నాయా అని న్యూజీలీండ్ ఆటగాళ్లు పరిశీలిస్తున్నారని కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు.





Leave a Reply