NewsInn

News in a Click

ప‌రేడ్ గ్రౌండ్ లో గ‌ణ‌తంత్ర వేడుక‌లు

పాల్గొన్న గ‌వ‌ర్న‌ర్, డిప్యూటీ సీఎం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్)

77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని యుద్ధ స్మారకం (War Memorial) వద్ద రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు మరియు ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో భాగంగా గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల పోలీసు బలగాల నుండి వారు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ, ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *