జనవరి 14 నుండి 2026 జూలై 14 వరకు
(హైదరాబాద్,న్యూస్ఇన్)

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు 3 శాతం తగ్గింపును అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని అమలు చేయనుంది. రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులు టికెట్లు ఈ యాప్ ద్వారా కొనుగోలు చేస్తేనే 3 శాతం తగ్గింపు ధరతో టికెట్ల పొందవచ్చని దక్షిణమధ్య రైల్వే ప్రజాసంబధాల అధికారి శ్రీధర్ వెల్లడించారు. రైల్ వన్ యాప్ ద్వారా టికెట్ ప్లాట్ ఫాం టికెట్లు సహా రైల్వే అమలుచేస్తున్న అన్ని సౌకర్యాలకు ఈ యాప్ అనుసంధానం చేసి ఉంటుందన్నారు.ప్రయాణీకులు తమ టిక్కెట్లను (జర్నీ/ప్లాట్ఫాం టిక్కెట్లు రెండూ) బుక్ చేసుకోవచ్చు తద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయడానికి క్యూలైన్లలో నిలబడకుండా నేరుగా రైలు ఎక్కే విధంగా అవకాశం దక్కుతుంది. టికెట్ కౌంటర్లలో రద్దీ కూడాతగ్గే అవకాశం ఉంటుంది. ప్రయాణీకులు ఆర్-వాలెట్, పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, యుపిఐ యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ విధానాల ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చని శ్రీధర్ తెలిపారు.





Leave a Reply