NewsInn

News in a Click

గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ప్రదానం

గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ప్రదానం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ 2024 సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభించిన “గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్” కార్యక్రమంలో భాగంగా, 2025 సంవత్సరానికి గాను ఎంపికైన, సంస్థలకు ఈ రోజు అవార్డులు ప్రదానం చేశారు. 2025 సంవత్సరానికి మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ, కార్పొరేట్ వాలంటీరింగ్ అనే నాలుగు విభాగాలలో విశిష్ట స్వచ్ఛంద సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలను గుర్తించి గౌరవ పురస్కారాలు అందజేయబడ్డాయి.సంబంధిత రంగాలలో ఉత్తమ సేవలు అందించిన అభ్యర్థుల నుంచి నవంబర్ 2025లో ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాలలో నామినేషన్లు స్వీకరించబడ్డాయి. ప్రముఖులతో ఏర్పాటు చేసిన అవార్డుల ఎంపిక కమిటీ ఈ నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది.అవార్డు గ్ర‌హీత‌ల‌కు రూ.2,00,000/- నగదుతో పాటు విశిష్ట సేవలను గుర్తించే ప్రశంసా పత్రాన్ని గవర్నర్ ఈరోజు లోక్ భవన్, నిర్వహించిన ‘AT HOME’ గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌కార్యక్రమంలో ప్రదానం చేశారు.

2025 సంవత్సరానికి అవార్డులు పొందిన వారు…

వ్యక్తులు.....

     మహిళా సాధికారత – శ్రీమతి రమాదేవి కన్నెగంటి, హైదరాబాద్
     గిరిజన అభివృద్ధి – శ్రీ తోడసం కైలాస్, వాఘాపూర్, ఆదిలాబాద్ జిల్లా
     రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ – డా. ప్రద్యుత్ వాఘ్రే, హైదరాబాద్
     కార్పొరేట్ వాలంటీరింగ్ – శ్రీ వి. రాజన్న, హైదరాబాద్


సంస్థలు ....

    మహిళా సాధికారత – సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ, ఘట్‌కేసర్
    గిరిజన అభివృద్ధి –  గట్టుమల్ల (వి), భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా
    రూరల్ హెల్త్ & మెడికల్ ఫిలాంత్రపీ – రామదేవ్‌రావు హాస్పిటల్, హైదరాబాద్
    కార్పొరేట్ వాలంటీరింగ్ – Give for Society, ఘట్‌కేసర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *